గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
ఫ్యామిలీ ఫంక్షనులో హాజరైన రెండోవ గ్రేడ్ కమీషనర్
ఇటీవల విడుదలైన గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 మంది విద్యార్థులు మాత్రమే ఉతిర్ణం పొంది వివిధ శాఖల్లో గ్రాడ్ 1, గ్రాడ్ 2 ఉద్యోగులుగా నియమితులయ్యారన్న విషయం తెల్సిందే. అయితే కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామరం గ్రామంలోని చితరమ్మ దేవాలయంలో శుక్రవారం నాడు జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకలో గ్రూప్ వన్ అభ్యర్థి రెండోవ గ్రేడ్ కమీషనర్ పూజారి శ్రావణి యాదవ్ కురుమ సందడి చేశారు.
పుట్టిన రోజు వేడుక వారి బంధువులదని సమాచారం. శ్రావణి కురుమ గ్రూప్స్ అభ్యర్థి అయిన ఆమె ఎప్పటి లాగే వారి తల్లిదండ్రులతో సింపుల్ గా కనిపించారు. వారి బంధువులు ఆవిడను అలాగే వారి తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అవసరం లేని ఆర్భాటాలు.. అక్కరకు రాని ఆవేశాలు.. ఎప్పటికీ పనికిరానివే..! ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి..! అనే సామెతలు గుర్తుకుతెచ్చుకున్నరు శ్రావణి వ్యవహార శైలి చూసిన వాళ్ళు. పలకరింపులో కూడా గౌరవం కనిపించడంతో ఆవిడను చూసి మురిసిపోయారు.
పేద కుటుంభం నుండి గ్రూప్ వన్.!
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ చెందిన ప్రభాకర్ రెడ్డి నగర్లోని పూజారి లింగయ్య యాదవ్ కురుమ ఒక స్క్రాప్ వ్యాపారి. ఎన్నో ఏండ్ల నుండి ఒడిదుడుకులు అనుభవిస్తూ విధ్య యొక్క విలువలు తెలిసినవాడు. ప్రస్తుత సమాజంలో చదువు ఉంటేనే విలువ అని గ్రహించిన లింగయ్య తన పుత్రిక పూజరి శ్రావణిని ఉన్నత చదువుతో పాటు గ్రూప్స్, సివిల్స్ కి కావాల్సిన రుసుము సమకూర్చి విద్యావంతురాలను చెయ్యడంతో పాటు శ్రావణి కృషి కూడా తొడుపడింది. గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రేడ్ 2 కమిషనరుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు.
Publisher
Namasthe Bharat