Category
Telangana
Telangana 

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్

హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్ భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు వందకు పైగా ఇండ్లను కూల్చేసిన హైడ్రా రోడ్డు పై నిరుపేదలు, ఇంట్లో సమగ్రితో బతుకమ్మ ఆడిన మహిళలు కన్నీమున్నీరుగా విలుపిస్తున్న బాధితులు 2025 బతుకమ్మ పండుగ మొదటి రోజు నిరుపేద ప్రజలకు గ్రహణంగా మారింది. పేదలకు బతుకమ్మ కానుకలు ఇవ్వాల్సిన సమయంలో కూల్చివేతలతో ప్రభుత్వం బాధితులకు హైడ్రా రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.
Read More...
Telangana 

Breaking : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం - ఇరవై మందికి గాయాలు

Breaking : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం - ఇరవై మందికి గాయాలు మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చర్చి గాగిల్లాపూర్  దగ్గర ఆగి ఉన్న ఒక ప్రైవేటు బస్సును, వెనుక నుండి మరో ప్రైవేట్ బస్సు ఢీ కోట్టడంతో, దాదాపు 20 మందికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు, రెండు అంబులెన్స్ లో, గాయాలైన వారిని కొంపల్లి మెడ్విన్  హాస్పిటల్ తరలించారు.
Read More...
Telangana 

వరంగల్ డిక్లరేషన్ విడుదల

వరంగల్ డిక్లరేషన్ విడుదల అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా వరంగల్ డిక్లరేషన్ అమలు చేసి తీరుతాం అని స్పష్టం చేసిన తెలంగాణ రాజ్యాధికార  పార్టీ(TRP)వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా పంది అంశాలను జోడిస్తూ డిక్లరేషన్ ను రిలీజ్ చేశారు పార్టీ అధినేత.
Read More...
Telangana 

ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దోమ‌ల‌గూడ‌, బాగ్‌లింగంప‌ల్లిలో ప‌ర్య‌టించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఆశోక్‌న‌గ‌ర్‌లో వ‌ర‌ద కాలువ విస్త‌ర‌ణ‌కు క‌మిష‌న‌ర్ ఆదేశం నగ‌రంలో నీట మునిగిన లోత‌ట్టు ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ శుక్ర‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీతో పాటు.. దోమ‌ల‌గూడ‌లోని గ‌గ‌న్‌మ‌హ‌ల్‌, అశోక్‌న‌గ‌ర్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. వారం రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో త‌మ ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. వ‌ర్షం ప‌డితే వ‌ణికిపోవాల్సి వ‌స్తోంద‌ని, బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీ వాసులు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ముందు వాపోయారు. లోత‌ట్టు ప్రాంతంలో ఉన్న త‌మ కాల‌నీలో పెద్ద‌మొత్తంలో వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంద‌ని అన్నారు. గ‌తంలో ఇక్క‌డ ఉన్న ఖాళీస్థ‌లంలోంచి హుస్సేన్‌సాగ‌ర్ నాలాలోకి వ‌ర‌ద నీరు చేరేద‌ని.. అక్క‌డ పైపులైను దెబ్బ‌తిన‌డంతో స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని చెప్పారు. 450 ఇళ్లు వ‌ర‌ద నీటిలో మునుగుతున్నాయ‌ని స్థానికులు వాపోయారు. గురువారం, శుక్ర‌వారం వ‌రుస‌గా హైడ్రా క‌మిష‌న‌ర్ వ‌చ్చి స‌మ‌స్య తీవ్ర‌త‌ను ప‌రిశీలించ‌డం, ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప‌ట్ల స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. 
Read More...
Telangana 

ఎండుతున్న నాటని మొక్కలు.!

ఎండుతున్న నాటని మొక్కలు.! పర్యవేక్షణ లేమి కారణంతో వృధాగా ఎండుతున్న పచ్చనితోరణం మండిపడుతున్న పర్యావరణ ప్రేమికులు కనారని లోకల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్
Read More...
Telangana  TS జిల్లాలు  

హైడ్రా కమీషనర్ రంగనాధ్ - ముంపు ప్రాంతాల పర్యటన

హైడ్రా కమీషనర్ రంగనాధ్ - ముంపు ప్రాంతాల పర్యటన న‌గ‌రంలో నీట మునిగిన ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు గురువారం ప‌రిశీలించారు.  అమీర్‌పేట‌లోని గాయ‌త్రి కాల‌నీ, మాధాపూర్‌లోని అమ‌ర్ సొసైటీ, బాగ్‌లింగంప‌ల్లి లోని శ్రీ‌రాంన‌గ‌ర్‌ల‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌ర్య‌టించారు.  అమీర్‌పేట వ‌ద్ద కాలువ‌ల్లో పూడిక తీయ‌డంతో సాఫీగా వ‌ర‌ద సాగుతోంద‌ని  ఇదే మాదిరి న‌గ‌రంలోని అన్ని చోట్ల నీటి మున‌క‌కు మూలాల‌ను తెలుసుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు.  పై నుంచి భారీ మొత్తంలో వ‌స్తున్న వ‌ర‌ద నీరు మైత్రి వ‌నం వెనుక ఉన్న గాయ‌త్రిన‌గ‌ర్‌ను ముంచెత్తుతోంద‌ని.. ఇక్క‌డ కూడా కాలువ‌ల‌లో సిల్ట్ తొల‌గించి వ‌ర‌ద ముప్పు స‌మ‌స్య‌త‌ను తొల‌గించాల‌ని అక్క‌డి నివాసితులు క‌మిష‌న‌ర్‌ను కోరారు. పై నుంచి నాలాల్లో పూడిక తీసుకుని వ‌స్తున్నామ‌ని.. ఇక్క‌డ కూడా ప‌రిష్కార చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు హామీ ఇచ్చారు. 
Read More...
Telangana  TS జిల్లాలు  

కోట్ల విలువ చేసే పార్కుల‌ను కాపాడిన హైడ్రా

కోట్ల విలువ చేసే పార్కుల‌ను కాపాడిన హైడ్రా పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను హైడ్రా బుధ‌వారం కాపాడింది. దాదాపు 1600 గ‌జాల వ‌ర‌కూ ఉన్న ఈ భూమి విలువ రూ. 16 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాలాన‌గ‌ర్ మండ‌లం, మూసాపేట స‌ర్కిల్ ప‌రిధిలోని స‌న‌త్‌న‌గ‌ర్ కోప‌రేటివ్ సొసైటీకి చెందిన లే ఔట్లో వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లాన్ని కాపాడింది. 1967లో 172 ప్లాట్ల‌తో ఈ లే ఔట్‌ను వేశారు. ఇందులో 1200 గ‌జాల స్థ‌లాన్ని పార్కుల‌కోసం కేటాయించారు. ఈ పార్కు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురౌతున్న‌ట్టు మోతిన‌గ‌ర్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్లు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు జీహెచ్ ఎంసీ, డీటీసీపీ, రెవెన్యూ అదికారుల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా.. పార్కు స్థ‌లంగా గుర్తించి వెంట‌నే ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. 
Read More...
Telangana 

బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు షురూ

బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు షురూ ప్రతి ఏటా కూకట్పల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించటం ఆనావాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా బతుకమ్మలను ఆడపడుచుల ఆటపాటల నడుమ ఘనంగా పూజించి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయటం అనే వేడుకలు కూకట్పల్లి తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి కన్నుల పండుగల దర్శనం ఇస్తాయి. ఇట్టి కార్యక్రమం యావత్తు రాష్ట్రంలోనే అమావాస్యకు ఒక్కరోజు ముందుగా 20.09.2025 తారీకున నుండి సాయంత్రం 5 గంటలకు నుండి కూకట్పల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద భారీగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ బతుకమ్మ ఆడిన తరువాత రోడ్డు ఆవతలి వైపున పి.ఎన్.యం. స్కూల్ నందు బతుకమ్మ ఆడి రంగాధాముని చెరువులో బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు20 తారీకున మొదలుకొని 9 తొమ్మిది రోజులు పాటు ఘనంగా వేడుకలు జరుపుకొని 29.09.2025 సోమవారం సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. సద్దుల బతుకమ్మ సంబరాలు : 29.09.2025 సోమవారం రోజున సద్దుల బతుకమ్మ సంబరాలను కూకట్పల్లి నియోజకవర్గం యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించటం జరుగుతుంది. రంగాధాముని చెరువు (ఐ.డి.ఎల్) కట్ట పై ప్రత్యేక ఏర్పాట్ల నడుమ వేలాది మంది హాజరై బతుకమ్మలను ఘనంగా ఆటపాటలతో పూజించి నిమజ్జనం చేస్తారు. ఆత్యంత వైభవోపేతంగా ఆకట్టుకొనేలా ఆలంకరించిన బతుకమ్మలకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులను కూడ యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు చేతుల మీదగా అందచేయటం జరుగుతుంది. బతుకమ్మ వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నాట్య ప్రదర్శనలు వంటి ఆదనపు కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బతుకమ్మ వేడుకల ముఖ్య వివరాలు : 1. 20.09.2025 శనివారం బతుకమ్మ ప్రారంభం 2. 21.09.2025 ఆదివారం పెద్దల అమావాస్య 3. 27.09.2025 శనివారం అట్ల బతుకమ్మ 4. 28.09.2025 ఆలిగిన బతుకమ్మ (ఈ రోజు బతుకమ్మ ఉండదు) 5. 29.09.2025 6. 2.10.2025 గురువారం విజయదశమి కూకట్పల్లి రామాలయం దేవాలయంలో సాయంత్రం 5. 30 విజయదశమి వేడకలు
Read More...
Telangana 

దుర్గ మాత విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్న వారి కొరకు తెలంగాణ పోలీస్ ప్రకటన

దుర్గ మాత విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్న వారి కొరకు తెలంగాణ పోలీస్ ప్రకటన తెలంగాణ రాష్ట్రంలోని కమిషనరేట్ల  పరిధి ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ల లిమిట్స్ లో దుర్గ మాత విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్న భక్తులు, యువకులు, మండపాల నిర్వహకులు ఈ క్రింది లింకు ద్వారా వారి వివరాలను నమోదు చేసుకోగలరని పోలీసులు ప్రకటన జారీ చేసారు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పర్మిషన్ APPLY చేస్కోండి.
Read More...
Telangana 

కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ - భారీగా పట్టుబడ్డ మధ్యం

కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ - భారీగా పట్టుబడ్డ మధ్యం అక్రమంగా అమ్ముతున్న 50 లీటర్ల మధ్యం నిల్వ ఉంచిన16 డొమెస్టిక్ సిలిండరులు సీజ్ సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు ఇతర రాష్ట్రాల పౌరుల వివరాలను తీసుకున్న వైనం  జీడిమెట్ల : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సిపి సైబరాబాద్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల రామిరెడ్డి నగర్ లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించరు పోలీసులు. ఈ యొక్క ఆపరేషన్లో ముగ్గురు ఎసిపిలు , పది మంది ఇన్స్పెక్టర్లు, 25 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అలాగే మొత్తం 260 మంది పోలీస్ సిబ్బందితో ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఇందులో ఎస్ఓటి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీజీపీఎస్ ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా 13 ఇండ్లను సెర్చ్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.  సర్చ్ లో ఐదుగురు రౌడీషీటర్లు అలాగే ఇద్దరు పాత నేరస్థులను గుర్తించడంతో పటు ఇతర రాష్ట్రాల పౌరుల వివరాలు తీసుకున్నారు.  అక్రమంగా నిల్వ ఉంచిన16 డొమెస్టిక్ సిలిండర్ లను సీజ్ చేసారు. వీరు డొమెస్టిక్ సిలిండర్స్ లో నుంచి కమర్షియల్ గా మార్చి ఇల్లీగల్ గా అమ్ముతున్న వ్యక్తులను అదుపులో తీసుకున్నారు.  అలాగే 50 లీటర్ల వరకు మధ్యాన్ని సీజ్ చేసి రెండు బెల్ట్ షాపుల పై కేసు నమవుదుకు రంగం సిద్ధం చేసారు. సెర్చ్ లో  దాదాపు 150 వరకు వెహికల్స్ ని చెక్ చేసి సరైన పత్రాలు లేని వాటిపై సంబంధిత సెక్షన్ లపై కేసులు నమోదు చేసారు.  ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సాధారణ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు, భరోసా కల్పించి, నేరస్తులకి వారు తప్పు చేయాలంటే భయపడేలాగా ఒక సంకేతాన్ని ఇచ్చే ఉద్దేశం కొరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని పోలీస్ ఉన్నత అధికారులు మీడియా తో స్పష్టం చేసారు. ఈ ఆపరేషన్ ఏసిపి బాలానగర్ పి.నరేష్ ఆధ్వర్యంలో జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆపరేషన్ నిర్వహించి ప్రజలకు చేరుతామని ఈ సందర్భంగా ఏసీపి  తెలియజేయడం పేర్కొన్నారు.    
Read More...
Telangana 

ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ (మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్, ఆటో ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, అప్ హోల్స్టర్, మిల్రెట్ మెకానిక్) పోస్టులకు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
Read More...
Telangana 

దొంగలించిన మేకలు గొర్రెలు జియాగూడ మార్కెట్ లో అమ్మకం

దొంగలించిన మేకలు గొర్రెలు జియాగూడ మార్కెట్ లో అమ్మకం  గత కొన్నేళ్లుగా రెండు జిల్లాలలో భారీగా మేకల, గొర్రెల దొంగతనం   రూ.2.62 లక్షల నగదు, నాలుగు వాహనాలు, 7 మొబైల్ లు, 4 కార్లు స్వాధీనం   మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపి ఎస్. లక్ష్మీనారాయణ వెల్లడి  షాద్ నగర్ : కార్లు వేసుకొని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి.. మేకలు, గొర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి.. అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి.. జియాగూడ మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్మేయాలి.. చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డ యువత ఒక ముఠాగా మారి చేస్తున్న ఈ ఆగడాలకు షాద్ నగర్ పోలీసులు తెరదించారు. రెండు జిల్లాలలో వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడ్డ ఈ ముఠా కు సంబంధించిన వివరాలను ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తో పాటు, కర్ణాటక , హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతానిలకు చెందిన మహమ్మద్ ఫిరోజ్ (24), అబ్దుల్ కలీం (25), మొహమ్మద్ సోహెల్ (24), షేక్ రవూఫ్ (23), మహమ్మద్ జమీర్ (26), మహమ్మద్ ఆరిఫ్ (25), షేక్ హసీనుద్దీన్ (22), కోయల్ కార్ సాయికిరణ్ (30)లు ఈ దోపిడీ ముఠాలోని సభ్యులు. చిన్నతనం నుంచి చెడు స్నేహాలకు అలవాటు పడి మత్తుపదార్థాలకు బానిసలైన ఈ యువకులు డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం నాలుగు వాహనాలను తమకు అందుబాటులో పెట్టుకున్నారు. ఆయా వాహనాలలో రోజు తిరిగి మేకలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి రాత్రి కాగానే ఒక డీసీఎం తీసుకుని వెళ్లి మేకలను అందులో ఎక్కించి జియాగూడ మార్కెట్లో అమ్మి వేయడం వీళ్లు దినచర్యగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే షాద్ నగర్ పరిధిలో చించోడులో 28, వెలిజర్లలో 8, చౌదరిగుడాలో 8, ఎల్కిచర్లలో 23, కొందుర్గు మండలం తంగెడపల్లిలో 8, వెంకిర్యాలలో 9, పరిగి మండలంలో కోటివాడలో 12, సుల్తాన్ పూర్ లో 30, దోమ మండలం వుదంతారావు పల్లి లో 15, జధిరసం పల్లిలో ఆరు మేకలు, గొర్రెలను దొంగిలించారు. ఇదే రీతిన ఈనెల 14వ తేదీన పురపాలక పరిధిలోని సోలిపూర్ వద్ద దొంగతనానికి పాల్పడుతుండగా షాద్ నగర్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. శంషాబాద్ డిసిపి రాజేష్ పర్యవేక్షణలో సాగిన ఈ విచారణ సిపిఎస్ డిసిపి ముత్యంరెడ్డి, అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు, శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, శ్రీలక్ష్మి ల నేతృత్వంలో విచారణ కొనసాగింది. షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్ కుమార్,డిటెక్టివ్ సిఐ వెంకటేశ్వర్లు లో ఆధ్వర్యంలో ఎస్సై లు పవన్ కుమార్, అవినాష్ బాబు, శ్రీనివాస్, భూపాల్, శివారెడ్డి, సిబ్బంది కుమార్, మహేందర్, జాకీర్, నవీన్, రమేష్, రవి, భీమయ్య, రవీందర్, కరుణాకర్, మోహన్ లాల్, జాకీర్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Read More...