నిహారిక కొణిదెల మరోహిట్ పక్కానా
గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. గోదావరి బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.9 కోట్ల బడ్జెట్తో రూపొంది, థియేట్రికల్గా రూ.24.5 కోట్ల వసూళ్లు సాధించింది. పాజిటివ్ టాక్తో పాటు, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం నిహారికకు నిర్మాతగా మంచి పేరును తీసుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యువ దర్శకుడు యదు వంశీ, నిహారికతో కలిసి మరో సినిమా రూపొందించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లోనే తెరకెక్కనుందని, 2026లో సెట్స్పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, కమిటీ కుర్రోళ్లు చిత్రం బాక్సాఫీస్ విజయం సాధించడమే కాదు, పలు అవార్డుల్ని సైతం దక్కించుకుంది. సైమా 2025లో నిహారికకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్, హీరో సందీప్ సరోజ్కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డులు లభించాయి. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డుల్లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభివృద్ధి అంశాలపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా గుర్తింపు దక్కింది. అలాగే దర్శకుడు యదు వంశీకి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ఒక ఫ్రెష్ కంటెంట్తో తెరపైకి రావడం పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, నిహారిక ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్న తాజా చిత్రం కూడా ఆసక్తికరంగానే ఉంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ-కామెడీ ఎంటర్టైనర్లో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్—all from మానస శర్మ & మహేష్ ఉప్పాల. సంగీతం అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నుంచి వచ్చే రెండో చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. గోదావరి బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.9 కోట్ల బడ్జెట్తో రూపొంది, థియేట్రికల్గా రూ.24.5 కోట్ల వసూళ్లు సాధించింది. పాజిటివ్ టాక్తో పాటు, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం నిహారికకు నిర్మాతగా మంచి పేరును తీసుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యువ దర్శకుడు యదు వంశీ, నిహారికతో కలిసి మరో సినిమా రూపొందించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లోనే తెరకెక్కనుందని, 2026లో సెట్స్పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, కమిటీ కుర్రోళ్లు చిత్రం బాక్సాఫీస్ విజయం సాధించడమే కాదు, పలు అవార్డుల్ని సైతం దక్కించుకుంది. సైమా 2025లో నిహారికకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్, హీరో సందీప్ సరోజ్కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డులు లభించాయి. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డుల్లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభివృద్ధి అంశాలపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా గుర్తింపు దక్కింది. అలాగే దర్శకుడు యదు వంశీకి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ఒక ఫ్రెష్ కంటెంట్తో తెరపైకి రావడం పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, నిహారిక ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్న తాజా చిత్రం కూడా ఆసక్తికరంగానే ఉంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ-కామెడీ ఎంటర్టైనర్లో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్—all from మానస శర్మ & మహేష్ ఉప్పాల. సంగీతం అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నుంచి వచ్చే రెండో చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.