రజనీ, కమల్ మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు చెయ్యరు!

On
రజనీ, కమల్ మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు చెయ్యరు!

సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌లను ఒకే తెరపై చూడాలని తమిళ అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు మెగాస్టార్ల క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కలయిక త్వరలోనే సాకారం కావాల్సిన అవకాశాలు కనిపించటం లేదు.ముందుగా, లోకేష్ కనగరాజ్ ఈ మల్టీస్టారర్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. కానీ రజనీకాంత్ ‘కూలీ’ చిత్రం flop కావడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్టు సమాచారం. దీంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది.ఇటీవల మరో వార్త బయటకు వచ్చింది. యువ దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు గుప్పుమంది. ప్రదీప్ ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి హిట్స్‌తో తెలుగులో మంచి గుర్తింపు పొందాడు. అయితే, తన తాజా చిత్రం ‘డూడ్’ ప్రమోషన్ సమయంలో ప్రదీప్ స్పష్టత ఇచ్చారు: “ప్రస్తుతం నా ఫోకస్ పూర్తిగా నటనపైనే ఉంది. రజనీకాంత్-కమల్‌హాసన్ సినిమాకు నేను డైరెక్టర్ కాదు,” అన్నారు.ప్రదీప్ వ్యాఖ్యలతో రజనీ-కమల్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ మళ్ళీ ఆగిపోయినట్టే భావిస్తున్నారు. దీర్ఘకాలం ఆపేక్షలో ఉన్న అభిమానులకు ఈ కలయిక త్వరలో కాదనే విషయం స్పష్టమైంది. ప్రదీప్ రంగనాథ్ నటించిన ‘డూడ్’ చిత్రం అక్టోబర్ 17న విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Screenshot_2025-10-09-01-01-28-38_a23b203fd3aafc6dcb84e438dda678b6

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise