ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 585 మంది మృతి
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా ఆరో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణువుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు కీలక ప్రాంతాలు, నగరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకూ 585 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల సంఘాలు తాజాగా తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 239 మంది టెహ్రాన్ వాసులు కాగా, 126 మంది భద్రతా సిబ్బంది, ఉన్నత అధికారులు ఉన్నట్లు సమాచారం