Shiva Kumar BS

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

రంగారెడ్డి 

మాలల రణభేరి మహాసభ ను విజయవంతం చేద్దాం షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ

మాలల రణభేరి మహాసభ ను విజయవంతం చేద్దాం షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ నియోకవర్గం, ఫరూఖ్ నగర్ మండలంలోని అన్నారం, కిషన్ నగర్  గ్రామాలలో మాలల రణభేరి మహాసభ కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ, ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు శేఖర్ పాల్గొని మాట్లాడుతూ నవంబర్ 23వ తేదీన సరూర్నగర్ లోని జరగబోయే మాలల రణభేరి మహాసభను చేయాలని పిలుపునిచ్చారు. మాలలు హక్కులకై ఉద్యమించాలని కోరారు. మాల ప్రజలు తమ ఉనికి చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాల మహానాడు డివిజన్ కార్యదర్శి , బర్ల శ్రీనివాస్, శివ శంకర్, లింగం, రవి, అనిల్, రామచంద్రయ్య, చెన్నయ్య, మానెమ్మ, పద్మమ్మ, పార్వతమ్మ, చిన్నమ్మ, అండాలు, అంజమ్మ, సబిత, కిష్టమ్మ, అంతమ్మ  తదితరులు పాల్గొన్నారు.
Read...
Cinema 

'సూర్య 46' షూటింగ్

'సూర్య 46' షూటింగ్ పెద్ద సినిమా స్టార్ సూర్య తన తదుపరి చిత్రాన్ని తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమా పేరు "సూర్య 46". ప్రస్తుతం యూరప్‌లోని బెలారస్‌ అనే దేశంలో సినిమా భాగాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణలో సూర్య కోసం ఒక అద్భుతమైన పోరాట సన్నివేశం మరియు ఒక ప్రత్యేక పాట కోసం పని చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు నటిస్తుండగా, రవీనా టాండన్, భవాని శ్రీ, రాధికా శరత్ కుమార్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారు. నాగ వంశీ ఫార్చ్యూన్‌ ఫోర్‌ ఫిలిమ్స్‌, సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ అనే మ్యూజిక్ కంపోజర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Read...
Cinema 

రజనీ, కమల్ మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు చెయ్యరు!

రజనీ, కమల్ మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు చెయ్యరు! సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌లను ఒకే తెరపై చూడాలని తమిళ అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు మెగాస్టార్ల క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కలయిక త్వరలోనే సాకారం కావాల్సిన అవకాశాలు కనిపించటం...
Read...
Cinema 

నిహారిక కొణిదెల మరోహిట్ పక్కానా

నిహారిక కొణిదెల మరోహిట్ పక్కానా గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, థియేట్రికల్‌గా రూ.24.5 కోట్ల వసూళ్లు సాధించింది. పాజిటివ్ టాక్‌తో పాటు, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం నిహారికకు నిర్మాతగా మంచి పేరును తీసుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యువ దర్శకుడు యదు వంశీ, నిహారికతో కలిసి మరో సినిమా రూపొందించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లోనే తెరకెక్కనుందని, 2026లో సెట్స్‌పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, కమిటీ కుర్రోళ్లు చిత్రం బాక్సాఫీస్ విజయం సాధించడమే కాదు, పలు అవార్డుల్ని సైతం దక్కించుకుంది. సైమా 2025లో నిహారికకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్, హీరో సందీప్ సరోజ్‌కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డులు లభించాయి. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డుల్లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభివృద్ధి అంశాలపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా గుర్తింపు దక్కింది. అలాగే దర్శకుడు యదు వంశీకి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ఒక ఫ్రెష్ కంటెంట్‌తో తెరపైకి రావడం పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, నిహారిక ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్న తాజా చిత్రం కూడా ఆసక్తికరంగానే ఉంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ-కామెడీ ఎంటర్టైనర్‌లో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్—all from మానస శర్మ & మహేష్ ఉప్పాల. సంగీతం అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నుంచి వచ్చే రెండో చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Read...
నారాయణపేట్  

ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి* 

ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి*    నారాయణపేట్ జిల్లా :తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని  నారాయణపేట  జిల్లా కలెక్టరేట్ లో  ఈ నెల 17 న  ఉదయం 10 గంటలకు నిర్వహించే జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరై  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని  కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళ  వారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణలో ఎవరికి ఇచ్చిన బాధ్యతలను  వారు సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా ఆమె లైన్ డిపార్ట్ మెంట్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టరేట్ ఏవో జయసుధ, ఆర్డీఓ రామచంద్రనాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read...
Telangana 

విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు

విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ లో పనిచేస్తున్న TGSPDCL సహాయక డివిజనల్ ఇంజనీరు ఇరుగు అంబేద్కర్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేశారు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఈ సందర్భంగా అతనికి, అతని బంధువులకు చెందిన 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హైదరాబాద్ ప్రముఖ ప్రదేశంలో ఒక ఇల్లు, ఐదు అంతస్తుల భవనం, రెండు ప్లాట్లు, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన "ఆంథర్ కెమికల్స్” అనే రసాయన కంపెనీతో పాటు బంగారు ఆభరణాలు, రెండు కార్లు రూ.2.18 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమాస్తుల కేసు దర్యాప్తులో కొనసాగుతోందని అధికారులు స్పష్టంచేశారు.
Read...
హైదరాబాద్ 

అక్రమ నిర్మాణాలను తొలగించాలి

అక్రమ నిర్మాణాలను తొలగించాలి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 లో వున్న స్థలం కబ్జా చేసి నిర్మించిన రెండు విల్లల అక్రమ నిర్మాణాల పై సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లోని ప్రజావానిలో పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాచుపల్లి మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ -3 బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 ను కబ్జా చేసి సర్వే నెంబర్ - 274 లో పత్రాలతో పర్మిషన్ను తీసుకొని  అక్రమ నిర్మాణలను చేపడుతున్నారు. అని అన్నారు. నిజాంపేట్లో ప్రవేటు స్థలం పత్రాలు చూపెడుతూ ప్రభుత్వ స్థలలను కబ్జా చేయడం సర్వ సాధారణంగా మారింది అని అన్నారు. బాచుపల్లి తహసీల్దార్ ఫుల్ సింగ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాను చందర్కి మున్సిపల్  కమిషనర్ షబ్బీర్ అలీకి, టౌన్ ప్లానింగ్ సరితకి అనేక సార్లు పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అని అన్నారు.అటి కబ్జా దారులకు స్థానిక అధికారులే సహకరిస్తున్నారు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అని అన్నారు.  కనుక వెంటనే పై కబ్జా, అక్రమ నిర్మాణాలు తొలిగించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రెవిన్యూ, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని హేచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఆశి.యాదయ్య, పీ.దాస్తగిరి,  తదితరులు పాల్గొన్నారు.
Read...
హైదరాబాద్ 

డివిజి ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్ధికసాయం

డివిజి ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్ధికసాయం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో నివసించే పి.శేఖర్(65) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడు. ఈ విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించరు. జి.రవి, సిహెచ్.భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, మహేష్, బషీర్, సుధాకర్, వెంకట్, చంద్రయ్య, సతీష్ కాలనీ వాసులు, తదితరులు ఉన్నారు.
Read...
హైదరాబాద్ 

కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు

కార్పొరేటర్ కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ కాలనీ 133 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బిజెపి నాయకుల దృష్టికి తీసుకొస్తే పీజేఆర్ బిజెపి నాయకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పర్యటించరు బిజెపి యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ., ఇండ్ల మధ్య డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ఇండ్ల నుండి వచ్చే డ్రైనేజ్ ఇండ్ల మధ్యనే నిలిచిపోవడం వలన దుర్గంధపు వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు అన్నారు. స్థానిక కార్పొరేటర్ కబ్జాలతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలను పట్టించూసుకోకుండా మోసం చేస్తున్నారు అన్నారు. కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కాలనీలలో మాత్రమే ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారే తప్ప నిరుపేదలు, సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు జీవనం సాగిస్తున్న కాలనీలలో చిన్నచూపు చూస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారు అన్నారు. ఇప్పటికైనా వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. పరిష్కారం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాధికారులను, ప్రజాప్రతినిధులను  హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, కేశవరావు, బిజెపి నాయకులు రామరాజు, నర్సింగ్ యాదవ్, సురేష్, జ్యోతి, రాజు, యువత, కాలనీవాసులు పాల్గొన్నారు.
Read...
హైదరాబాద్ 

ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ పాదయాత్ర

ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ పాదయాత్ర 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్ కాలనీలలో డ్రైనేజీ, పారిశుద్యనికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించరు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ., కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసమైన బడ్జెట్ ను ఎస్టీమషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశించారు. కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, చెత్తను రోడ్ల మీద లేదా బిల్డింగ్ ల మధ్యలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు. జి.ఎచ్.ఎం.సి సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి చెత్తను రోడ్లమీద వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు. అలాగే మీ ఇంటికి వచ్చి సేవలందించే పారిశుధ్య, ఎంటమాలజి మరియు వైద్య శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రజలందరూ సహకరించి వారి సూచనలు పాటిస్తూ రోగాలకు దూరంగా ఉండాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జి.రవి, భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, మహేష్, బషీర్, సుధాకర్, వెంకట్, చంద్రయ్య, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read...
మేడ్చల్ 

45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్

45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ ఫతే నగర్ డివిజన్ పరిధిలోని  పిట్టల బస్తీలో  కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 45 లక్షల రూపాయల నిధులతో పిట్టల బస్తీ వాసుల కోరిక మేరకు స్థానికులతో కలిసి పనులను ప్రారంభించిరు  కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ., పిట్టల బస్సులో ST నిధుల కింద 90 లక్షల రూపాయలతో బస్తీ వారి కోసం స్మశాన వాటికను, రోడ్లను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించుట కొరకు భూమి పూజ చేయడం జరిగిందని, అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యువత కొరకు జిమ్ ను  కూడా అతి త్వరలో యువత కొరకు అందుబాటులోకి తీసుకొస్తామని వారి హామీ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపి, జైపాల్ జయమ్మ, బబ్లు గణేష్, సుధాకర్, కంచి బిక్షపతి, గంగరాజు, కుక్కల రాము, బాగయ్య, రామ గౌడ్, సురేందర్ పాల్గొన్నారు.
Read...
మేడ్చల్ 

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

అంత్యక్రియలకు ఆర్ధికసాయం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ, పిజెఆర్ నగర్ లో అనారోగ్యంతో బాధపడుతూ పి.శేఖర్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగ్ యాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
Read...