NAMASTHEBHARAT
నమస్తే భారత్ E పేపర్  

నమస్తే భారత్ E Paper 23-04-2025

నమస్తే భారత్ E Paper 23-04-2025 నమస్తే భారత్ E Paper 23-04-2025
Read...

ఇంటర్ ఫలితాల్లో స్టేట్ 2వ టాపర్ గా చెరుకూరి అన్విత

ఇంటర్ ఫలితాల్లో స్టేట్ 2వ టాపర్ గా చెరుకూరి అన్విత నమస్తే భారత్ : నారాయణ కాలేజీ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. నారాయణ కాలేజీ, కొంపల్లి బ్రాంచ్ లో ఇంటర్ మొదటి సంత్సరం చదువుతున్న చెరుకూరి అన్విత 468/470 మార్కులు సాధించి స్టేట్ 2వ టాపర్ గా నిలిచింది. దింతో అన్వితను నారాయణ కాలేజీ మేనేజ్మెంట్ శుభాకాంక్షలు తెలిపింది.
Read...

జర్నలిస్టుల సమస్యల పై ప్రభుత్వం మౌనం విడాలి

జర్నలిస్టుల సమస్యల పై ప్రభుత్వం మౌనం విడాలి మహాసభలో నూతన కార్యవర్గం ఏర్పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందునూరి నాగరాజుగౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడిగా పిట్ల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.శివకుమార్, కార్యదర్శి ఏ. గోవిందరావు ఎన్నిక   కుత్బుల్లాపూర్ : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో పాలకులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం టీడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తృతీయ మహాసభ సూరారంలోని వీఐపీ గార్డెన్ లో ఘనంగా జరిగింది. అధ్యక్షుడు గడ్డమీది అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేక పోయిందని, ఇళ్ళ స్థలాల విషయంలో చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యల పట్ల గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తే పాత్రికేయుల పోరాటం తప్పదనిఅన్నారు.రాష్ట్రంలో ప్రత్యామ్నాయ జర్నలిస్టు యూనియన్ గా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నెంబర్ వన్ యూనియన్ గా బలపడిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, త్వరలో అన్ని జిల్లాల్లో మహాసభలు పూర్తి చేసి రాష్ట్ర మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయని, ఒకవైపు యాజమాన్యాలు,ప్రభుత్వాలు పట్టించుకోక, మరోవైపు దాడులు,అవమానాలు పెరిగిపోతున్నాయని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు శిక్షణతో కూడిన వృత్తినైపుణ్యతను పెంపొందించుకొని విధినిర్వహణలో సమర్ధవంతంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని జర్నలిస్టు సంఘాలు ప్రజల, పాత్రికేయుల పక్షం కాకుండా పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని విమర్శించారు. టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ పాలకుల పక్షం కాకుండా కేవలం పాత్రికేయుల పక్షాన నిలిచి సమస్యలపై పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్ కే సలీమా మాట్లాడుతూ., తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు వంటి సమస్యలు పరిష్కరించాల్సివుందని, హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో ఫెడరేషన్ జరుపబోయే ఉద్యమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. మహాసభలో నూతన కార్యవర్గం ఎన్నిక తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందునూరి నాగరాజుగౌడ్(జెమినీ నాగరాజు), కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడుగా పిట్ల శంకర్ (విశాలాంధ్ర), వర్కింగ్ ప్రెసిడెంట్ గా బి.శివకుమార్ (శనార్తి తెలంగాణ),కార్యదర్శిగా ఏ. గోవిందరావు (వార్త),ఉపాధ్యక్షులుగా ఈ. మంజుల, (ప్రజా వినికిడి), ఎం. దివాకర్, కావలి మోహన్ ముదిరాజ్, ప్రచార కార్యదర్శిగా పి. బ్రహ్మచారి (తెలుగు ప్రభ),సహాయ కార్యదర్శిగా కొండ సంజీవ్ కుమార్ (ఆంధ్రప్రభ),కోశాధికారిగా మన్నే వినోద్ (నవతెలంగాణ),కార్యవర్గ సభ్యులుగా లక్ష్మి (సాక్షిత), సుస్మిత (ప్రజాకలం),  రాజు (ప్రజాదర్బార్) తదితరులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.       ఎలక్ట్రానిక్ మీడియా కమిటీలోతెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీబీజేఏ) కన్వీనర్ గా రాజేష్, కో-కన్వీనర్లుగా కోటేశ్వరరావు, దుర్గారావు, శ్రీనివాస్, సత్య, సత్యం తదితరులు ఎన్నికయ్యారు.
Read...

#Draft: Add Your Title

#Draft: Add Your Title
Read...
హైదరాబాద్ 

బీటెక్ బయో టెక్నాలజీ రెగ్యులర్ కోర్సును ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రారంభించాలి: డాక్టర్ అడ్డగట్ల రవీందర్

బీటెక్ బయో టెక్నాలజీ రెగ్యులర్ కోర్సును ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రారంభించాలి: డాక్టర్ అడ్డగట్ల రవీందర్ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి ప్రభుత్వ యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని ఓయూ అధ్యాపకుడు డాక్టర్ అడ్డగట్ల రవీందర్ డిమాండ్ చేశారు. కొవిడ్ లాంటి ఎన్నో...
Read...
మెదక్ 

సెలవు రోజు కూడా రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

సెలవు రోజు కూడా రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ రామాయంపేట, ఏప్రిల్‌ 13 : రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులను సెలవు రోజు కూడా తీసుకోవడం జరుగుతుందని రామాయంపేట ఎంపీడీవో షాజులుద్దీన్‌ పేర్కొన్నారు. ఇవాళ ఎంపీడీవో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్‌వైవి దరఖాస్తులకు ఏప్రిల్‌ 14వ తేదీ (సోమవారం) చివరి...
Read...
నల్గొండ 

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కట్టంగూర్, ఏప్రిల్ 13 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చిన్నపురి ఉన్నత పాఠశాలలో 1999- 2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతోపాటు విద్యార్థులు అప్పటి...
Read...
కరీంనగర్ 

కెమిస్ట్ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌

కెమిస్ట్ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌ పెద్దపల్లి, ఏప్రిల్‌13: కెమిస్ట్‍ అండ్‌ డ్రగ్గిస్ట్‍ అసోసియేషన్‌ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మాడూరి వినోద్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. వినోద్‌ కుమార్‌ ప్యానల్‌ వరసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించింది. పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో...
Read...

జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్

జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా 26, 30, 31, 32, 33వ వార్డులలో  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి భూపతి రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ., మహాత్మ గాంధీ వారసత్వాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం అంటే యావత్ మన దేశ ప్రజలను అవమానపరిచినట్లే  అన్నారు. బిజెపి పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాసౌమ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందాన్నారని ఆరోపించారు. బిజెపి అసమర్ధ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో బస్తి నుండి బజారు వరకు జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. డివిజన్ స్థాయి,మండల స్థాయి, బూత్ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గోని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కోలన్ శ్రీనివాస్ రెడ్డి,జగదీష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, అంజాద్, లక్ష్మణ్, శ్రీనివాసరావు, యువ కిరణ్ రెడ్డి, నాగిరెడ్డి, సాయికుమార్,వర్మ,మురళి గార్లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Read...
International 

భారతీయ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి..

భారతీయ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి.. న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్‌లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని మందుల...
Read...
Astrology 

శుభ వాస్తు

శుభ వాస్తు ఇంటి ప్లాను సొంతంగా మార్చుకొని కట్టుకొనేటట్లు అయితే.. ఆ ప్లాను తీసుకోవడం ఎందుకు? మీరే ఇష్టం వచ్చిన ప్లాను వేసుకొని కట్టుకోవచ్చు కదా! ఎవరు వద్దంటారు. మీ ఇల్లు మీ ఇష్టం కదా! శాస్త్రం ప్రకారం కట్టాలి అనుకుంటే.. దానిని పూర్తిగా...
Read...
Sports 

పంజాబ్‌తో మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించిన అభిషేక్‌ శర్మ..!

పంజాబ్‌తో మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించిన అభిషేక్‌ శర్మ..! పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ అద్భుతంగా రాణించారు. తన ఐపీఎల్‌ కెరియర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇది ఐపీఎల్‌ చరిత్రలో ఆరో ఫాస్టెస్ట్‌ సెంచరీ. దాంతో...
Read...

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels