Shiva Kumar BS

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ పై వెంటనే దృష్టి సారించాలి

తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్  పై వెంటనే దృష్టి సారించాలి టీవై జెఎఫ్ రాష్ర్ట అధ్యక్షులు డా. జితేందర్ రావు    హైదరాబాద్ జనవరి 4  నమస్తే భారత్      తెలంగాణలో  జర్నలిస్టుల అక్రిడిటేషన్  పై వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ ( టీవై జెఎఫ్ )రాష్ర్ట అధ్యక్షులు డా.  తనుగుల జితేందర్ రావు అన్నారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ  జర్నలిస్టుల  అక్రిడిటేషన్  కేవలం గుర్తింపు కార్డు కాదు అది ప్రజాస్వామ్య సమాజంలో జర్నలిస్టులు పోషించే కీలక పాత్రకు అధికారిక గుర్తింపు అని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న అక్రిడిటేషన్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే జర్నలిస్టుల కోసం తీవ్ర ఆందోళనగా మారింది. ఆలస్యం, పారదర్శకత లోపం, స్పష్టమైన విధాన రూపకల్పనల లేమి వృత్తిపరమైన మరియు నైతిక సవాళ్లను సృష్టిస్తున్నాయన్నారు.వందలాది జర్నలిస్టులు 
Read...
Telangana 

ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నమస్తే భారత్ :-తొర్రూరు అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు,కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు అందించేందుకు తొర్రూరుతో పాటు పలు ప్రాంతాలలో ఆసుపత్రులు నిర్మించాడని,విద్యా కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాడని పలుచోట్ల దేవాలయాలు నిర్మించాడని అన్నారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,పేదల గుండెల్లో నిలిచిన సేవా మూర్తి,పాలకుర్తి ప్రజల అభిమాన నేత రాజేందర్ రెడ్డి జన్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు,పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు అందించిన మహ
Read...
కొత్తగూడెం 

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం మదర్ థెరిస్సా ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళికారుణ్య చిల్డ్రన్స్ ఆశ్రమంలో ఘనంగా పూలే జయంతి వేడుకలుపిల్లలకు రూ. 10 వేల విలువైన నిత్యావసరాల పంపిణీ నమస్తే భారత్ భద్రాచలం ఆర్ సి రిపోర్టర్ కోట దిలీప్ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారుమదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాంనగర్ కాలనీలోని కారుణ్య చిల్డ్రన్స్ ఆశ్రమంలో శనివారం విద్యార్థులకు సుమారు రూ. 10 వేల రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులను ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి మాట్లాడుతూ, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని 
Read...
Telangana 

సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ తెలుగుతల్లి నగర్

సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ  తెలుగుతల్లి నగర్ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రిబాయి ఫూలే గారి జయంతి సందర్భంగా... ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేమ్స్ గారు భారతీయ సంఘ సంస్కర్త తొలి ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రీబాయి పూలే గారి  జయంతి సందర్భంగా కళాకారుడు శంకర్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించిన మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు గారు సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ గారు సీనియర్ కాంగ్రెస్ నేత జేమ్స్ గారు అనంతరం వారు మాట్లాడుతూ భారత తొలి ఉపాధ్యాయురాలు పురుషులు స్త్రీలు సమానత్వంగా ఉండాలని విద్య అందరికీ అందాలని కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త వారి యొక్క బాటలో మనందరం నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో
Read...
మేడ్చల్ 

కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం వనభోజనాలు

కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం వనభోజనాలు మియాపూర్ మెట్రో స్టేషన్ ప్రక్కనగల మయూర్ నగర్ వెళ్లే రోడ్డు పక్కన గ్రౌండ్లో కెపిహెచ్బి కమ్మ సంఘకార్తీకమాస వనభోజనాల ఏర్పాట్లు చేస్తున్నామని కమ్మ సోదర సోదరీమణులు అందరూ ఆదివారం జరిగే కార్తీక వన భోజన మహోత్సవానికి  తప్పక హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.ఈసారి జరగబోయే కమ్మ కార్తీక వనభోజనం మహోత్సవాల్లో ప్రత్యేకంగా తమ కులంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు చేయూతని ఇచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని, వనభోజనాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు విలువైన సందేశాలు ఉంటాయని వారు తెలిపారు...
Read...
రంగారెడ్డి 

మాలల రణభేరి మహాసభ ను విజయవంతం చేద్దాం షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ

మాలల రణభేరి మహాసభ ను విజయవంతం చేద్దాం షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:రంగారెడ్డి జిల్లా,షాద్ నగర్ నియోకవర్గం, ఫరూఖ్ నగర్ మండలంలోని అన్నారం, కిషన్ నగర్  గ్రామాలలో మాలల రణభేరి మహాసభ కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు సుంకం నరసింహ, ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు శేఖర్ పాల్గొని మాట్లాడుతూ నవంబర్ 23వ తేదీన సరూర్నగర్ లోని జరగబోయే మాలల రణభేరి మహాసభను చేయాలని పిలుపునిచ్చారు. మాలలు హక్కులకై ఉద్యమించాలని కోరారు. మాల ప్రజలు తమ ఉనికి చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాల మహానాడు డివిజన్ కార్యదర్శి , బర్ల శ్రీనివాస్, శివ శంకర్, లింగం, రవి, అనిల్, రామచంద్రయ్య, చెన్నయ్య, మానెమ్మ, పద్మమ్మ, పార్వతమ్మ, చిన్నమ్మ, అండాలు, అంజమ్మ, సబిత, కిష్టమ్మ, అంతమ్మ  తదితరులు పాల్గొన్నారు.
Read...
Cinema 

'సూర్య 46' షూటింగ్

'సూర్య 46' షూటింగ్ పెద్ద సినిమా స్టార్ సూర్య తన తదుపరి చిత్రాన్ని తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమా పేరు "సూర్య 46". ప్రస్తుతం యూరప్‌లోని బెలారస్‌ అనే దేశంలో సినిమా భాగాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణలో సూర్య కోసం ఒక అద్భుతమైన పోరాట సన్నివేశం మరియు ఒక ప్రత్యేక పాట కోసం పని చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు నటిస్తుండగా, రవీనా టాండన్, భవాని శ్రీ, రాధికా శరత్ కుమార్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారు. నాగ వంశీ ఫార్చ్యూన్‌ ఫోర్‌ ఫిలిమ్స్‌, సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ అనే మ్యూజిక్ కంపోజర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Read...
Cinema 

రజనీ, కమల్ మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు చెయ్యరు!

రజనీ, కమల్ మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు చెయ్యరు! సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌లను ఒకే తెరపై చూడాలని తమిళ అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు మెగాస్టార్ల క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కలయిక త్వరలోనే సాకారం కావాల్సిన అవకాశాలు కనిపించటం...
Read...
Cinema 

నిహారిక కొణిదెల మరోహిట్ పక్కానా

నిహారిక కొణిదెల మరోహిట్ పక్కానా గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, థియేట్రికల్‌గా రూ.24.5 కోట్ల వసూళ్లు సాధించింది. పాజిటివ్ టాక్‌తో పాటు, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం నిహారికకు నిర్మాతగా మంచి పేరును తీసుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యువ దర్శకుడు యదు వంశీ, నిహారికతో కలిసి మరో సినిమా రూపొందించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లోనే తెరకెక్కనుందని, 2026లో సెట్స్‌పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, కమిటీ కుర్రోళ్లు చిత్రం బాక్సాఫీస్ విజయం సాధించడమే కాదు, పలు అవార్డుల్ని సైతం దక్కించుకుంది. సైమా 2025లో నిహారికకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్, హీరో సందీప్ సరోజ్‌కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డులు లభించాయి. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డుల్లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభివృద్ధి అంశాలపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా గుర్తింపు దక్కింది. అలాగే దర్శకుడు యదు వంశీకి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ ఒక ఫ్రెష్ కంటెంట్‌తో తెరపైకి రావడం పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, నిహారిక ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్న తాజా చిత్రం కూడా ఆసక్తికరంగానే ఉంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ-కామెడీ ఎంటర్టైనర్‌లో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్—all from మానస శర్మ & మహేష్ ఉప్పాల. సంగీతం అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ నుంచి వచ్చే రెండో చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Read...
నారాయణపేట్  

ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి* 

ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి*    నారాయణపేట్ జిల్లా :తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని  నారాయణపేట  జిల్లా కలెక్టరేట్ లో  ఈ నెల 17 న  ఉదయం 10 గంటలకు నిర్వహించే జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరై  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని  కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళ  వారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణలో ఎవరికి ఇచ్చిన బాధ్యతలను  వారు సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా ఆమె లైన్ డిపార్ట్ మెంట్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టరేట్ ఏవో జయసుధ, ఆర్డీఓ రామచంద్రనాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read...
Telangana 

విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు

విద్యుత్ అధికారిపై అవినీతి నిరోధక శాఖ దాడులు హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ లో పనిచేస్తున్న TGSPDCL సహాయక డివిజనల్ ఇంజనీరు ఇరుగు అంబేద్కర్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేశారు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఈ సందర్భంగా అతనికి, అతని బంధువులకు చెందిన 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో హైదరాబాద్ ప్రముఖ ప్రదేశంలో ఒక ఇల్లు, ఐదు అంతస్తుల భవనం, రెండు ప్లాట్లు, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన "ఆంథర్ కెమికల్స్” అనే రసాయన కంపెనీతో పాటు బంగారు ఆభరణాలు, రెండు కార్లు రూ.2.18 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమాస్తుల కేసు దర్యాప్తులో కొనసాగుతోందని అధికారులు స్పష్టంచేశారు.
Read...
హైదరాబాద్ 

అక్రమ నిర్మాణాలను తొలగించాలి

అక్రమ నిర్మాణాలను తొలగించాలి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 లో వున్న స్థలం కబ్జా చేసి నిర్మించిన రెండు విల్లల అక్రమ నిర్మాణాల పై సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లోని ప్రజావానిలో పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బాచుపల్లి మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ -3 బ్లాక్ నెంబర్ 21,22 వెనక వున్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 233/15 ను కబ్జా చేసి సర్వే నెంబర్ - 274 లో పత్రాలతో పర్మిషన్ను తీసుకొని  అక్రమ నిర్మాణలను చేపడుతున్నారు. అని అన్నారు. నిజాంపేట్లో ప్రవేటు స్థలం పత్రాలు చూపెడుతూ ప్రభుత్వ స్థలలను కబ్జా చేయడం సర్వ సాధారణంగా మారింది అని అన్నారు. బాచుపల్లి తహసీల్దార్ ఫుల్ సింగ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాను చందర్కి మున్సిపల్  కమిషనర్ షబ్బీర్ అలీకి, టౌన్ ప్లానింగ్ సరితకి అనేక సార్లు పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అని అన్నారు.అటి కబ్జా దారులకు స్థానిక అధికారులే సహకరిస్తున్నారు అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు అని అన్నారు.  కనుక వెంటనే పై కబ్జా, అక్రమ నిర్మాణాలు తొలిగించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రెవిన్యూ, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని హేచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఆశి.యాదయ్య, పీ.దాస్తగిరి,  తదితరులు పాల్గొన్నారు.
Read...