ఘనంగా దసరా పండగ ఉత్సవాలు

చితరమ్మ దర్శించుకున్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

On

విజయదశమి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఇంట్లో దసరా పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

IMG_20251002_232659

కూకట్ పల్లిలో శ్రీ చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాహన పూజ చేశారు.

IMG_20251002_232026

సాయంత్రం రామాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి తాండ్రపాపారాయుడు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ధర్మధ్వజంను ఎగురవేసి, అనంతరం జమ్మి చెట్టు పూజలో పాల్గొన్నారు. తదనంతరం శ్రీ పట్టాభి సీతారాముల వారి దర్శనం చేసుకొని, రవాణ దహనం కార్యక్రమాన్ని వీక్షించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులను ఆత్మీయంగా అలై బలై చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

IMG_20251002_232038

ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ., “దసరా పండుగ అనేది చెడుపై మంచి విజయాన్ని సూచించే పండుగ. ఈ పండుగ మనకు ధర్మం, న్యాయం, నీతి విలువలను పాటించాలనే స్పూర్తిని కలిగిస్తుంది. సమాజంలో ఐకమత్యం, సోదరభావం మరింత బలపడాలని అందరికీ దసరా శుభాకాంక్షలు” అని తెలిపారు.

IMG_20251002_232010

Publisher

Namasthe Bharat

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise