ఎండుతున్న నాటని మొక్కలు.!

పటించుకొని అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు - కూకట్ పల్లిలోని అంబిర్ చెరువు సుందరికర్ణలో భాగంగా తెచ్చిన మొక్కలు

On

  • పర్యవేక్షణ లేమి కారణంతో వృధాగా ఎండుతున్న పచ్చనితోరణం
  • మండిపడుతున్న పర్యావరణ ప్రేమికులు
  • కనారని లోకల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్

శేరిలింగంపల్లి నియోజకవర్గం, కూకట్ పల్లి సిర్కిల్ 24 పరిధిలోని ఎల్లమ్మబండ శివారులో ఉన్న అంబిర్ చెరువు సుందరికర్ణలో భాగంగా తెచ్చిన మొక్కలు నాటకుండా వృధాగా వదిలేశారు అధికారులు.

IMG-20250919-WA0047

పచ్చదనంతో కళకళలాడాల్సిన మొక్కలు ఎండిపోతున్నాయి. నాటాల్సిన పచ్చనితోరణంపై జీహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు, సిబ్బంది శ్రద్ధ చూపకపోవడం రంగుమారి ఎండిపోయాయి.

IMG-20250919-WA0036

చెరువుకు ఇరువైపులా మొక్కలను నాటి సూదరంగా తీర్చిదిద్ది పర్యటక ప్రాంతంగా మార్చి, ప్రజలు సేద తీరేందుకు ఉపయోగపడాలని  కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ చేసింది గత కేసీఆర్ ప్రభుత్వం. అందులో భాగంగా లోకల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. కానీ ఆప్రణాళికలు ఎక్కడ కనపడడం లేదు.

IMG-20250919-WA0045

ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మొక్కలను సంరక్షించకుండా బాధ్యతరహితంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, వృధాగా నాటకుండా వదిలేసిన మొక్కలను ఇతర ప్రాంతాలకు తరలించి, లేదా స్థానిక బస్తీల్లో నాటి ఎండకుండా చూడాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. భవిష్యత్తరాలకు మంచి పర్యవరాన్ని అందించి ఆహ్లదకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

IMG-20250919-WA0040

IMG-20250919-WA0037

About The Author

Advertise

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise