దివ్యాంగులను అన్ని రంగాలలో  ప్రోత్సహించాలి

On
దివ్యాంగులను అన్ని రంగాలలో  ప్రోత్సహించాలి

 

ఎంపీడీఓ డాక్టర్  వనపర్తి అద్వైత 

ఖానాపురం  డిసెంబర్ 4 ( నమస్తే భారత్  ) :  

రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగుల ఎదుగుదలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఖానాపురం ఎంపీడీఓ డాక్టర్  వనపర్తి అద్వైత అన్నారు.తెలంగాణ ప్రభుత్వము  విద్యాశాఖ వారి అధ్యర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం  ఖానాపురం ఎమ్మార్సీ  నందు ఎంఈఓ  శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ దివ్యాంగులను చులకన చూడకూడదన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహించి ముందుకునడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.
 విద్యార్థినీ విద్యార్థులు చదువులో రాణించాలని, వికలాంగతత్వం చదువుకు అడ్డు కాకూడదన్నారు.
 మీరందరూ తల్లిదండ్రులను గౌరవిస్తూ చదువులో ముందు వరుసలో ఉండాలన్నారు. ఖానాపురం ఎస్ ఐ రఘుపతి మాట్లాడుతూ దివ్యాంగులు మానసిక స్థైర్యంతో విద్య వైద్యరంగాలలో రాణించాలని అన్నారు

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise