హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

ఇంటికో మనిషి ఊరి కో బండి ఖమ్మం రండి

On

100 సంవత్సరాల పూర్తి సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరణ

 సిపిఐ జిల్లా కార్యదర్శి జాతీయ సమితి సభ్యులు 

పాలమాకుల జంగయ్య ప్రజలకు కమ్యూనిస్టు శ్రేణులకు పిలుపు

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జనవరి 04,జనవరి 18న ఖమ్మం లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రతి ఇంటికి ఒక మనిషి ప్రతి ఊరికి ఒక బండి మాట్లాడుకుని కార్మిక వర్గం కష్టజీవులు చలో ఖమ్మం కార్యక్రమానికి రావాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వాల్ పోస్టర్స్ ను ఈరోజు శంషాబాద్ మండలం కేంద్రంలోని జిల్లా కార్యాలయం ఆవరణలో గోడపత్రికలను విడుదల చేశారు. 

 

WhatsApp Image 2026-01-04 at 7.16.53 PMఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఖమ్మం పట్టణంలో జనవరి 18న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. భారతదేశంలో సిపిఐ ఏర్పడిన తర్వాత రాజరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా భూస్వామ్య పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది అని ఆయన అన్నారు.నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేసి నిజం సర్కారులకులదోసి ప్రజాస్వామ్య పరిపాలన కోసం అశువులు బాపిన వీరులు ఎందరో కమ్యూనిస్టులే అని ఆయన తెలిపారు. బాంచను దొర నీ కాళ్లు మొక్కుతా అని పిలిచే కాలము నుండి తలెత్తుకొని తిరిగే కాలం వైపు సమాజం నడిచింది అంటే అది కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ఫలితమే అని ఆయన అన్నారు. 
 జాతీయ ఉద్యమంలో సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని నాటినుండి నేటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక వర్గ పోరాటాలకు ప్రజా పోరాటాలకు సిపిఐ పార్టీ నాయకత్వం వహించి నిర్వహించిందని అన్నారు.పోస్టర్స్ విడుదల కార్యక్రమంలో సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్ రావు సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు టి రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు 6 యాదగిరి, పల్నాటి యాదయ్య, భారతరాజు, నరసింహ, మండల కార్యదర్శి కే చంద్ యాదవ్, కందుకూరు మండల కార్యదర్శి రాజు. జిల్లా సమితి సభ్యులు సక్రు నాయక్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్యార క్రాంతి కుమార్ కొండల్ జెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise