Tag
నమస్తే
రంగారెడ్డి 

బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ

బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ కేంద్ర ఎన్నికల సంఘం బిజెపి అనుబంధ విభాగంగా పనిచేస్తుందని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు, డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ ఏఐసిసి ఇన్చార్జి  చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. బిజెపి ఓటు చోరీ కి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 కోట్ల మంది సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీ చ్చా నాయక్  అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి వంశీచంద్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Read More...
మహబూబాబాద్ 

విషాదం : బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

విషాదం : బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇటికాల నర్సయ్య-స్వాతి దంపతుల కుమారుడు రితిక్, నర్సయ్య సోదరి అనిత-శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు అందరు వారి బంధువులు చనిపోవడంతో వేరే గ్రామానికి వెళ్లారు. వీరు ఇద్దరు ఇంటివద్ద ఉన్నారు. ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయబావి వద్ద ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. బావి వద్ద చెప్పులు బట్టలు ఉండడంతో గ్రామస్తులు వెతకడంతో ఇటికాల రితిక్ అనే బాలుడి మృతదేహం లభ్యమైంది.
Read More...

Advertisement