24 గంటల్లో హత్య కేసును చేదించిన కొత్తూరు పోలీసులు
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో మంగళవారం జరిగిన టైల్స్ వర్కర్ ఎండి సంశూల్ (31) హత్య కేసును కొత్తూరు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం..పురపాలక పరిధిలో ఉన్న ఓ వెంచర్ లోని ఇంటి నిర్మాణంలో పనిచేసే సంశూల్ (బీహార్), ప్లాస్టరింగ్ వర్కర్ గంగా ప్రసాద్ కు (ఛత్తీసఘర్) పని విషయంలో గొడవలు, అలాగే తన భార్యపై సంశూల్ అనుమానంగా చూస్తున్నాడనే కక్షతో గంగా ప్రసాద్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 01:00 గంటలకు, మద్యం సేవించిన గంగా ప్రసాద్, కిచెన్ రూమ్లో పడుకొని ఉన్న సంశూల్ తలపై గనేట్ రాయితో బలంగా కొట్టి హత్య చేశాడు. హత్య తర్వాత బుధవారం పెంజర్ల రోడ్డులో అనుమానాస్పదంగా కనిపించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసును వేగంగా ఛేదించిన ఎస్.ఐ.లు గోపాల కృష్ణ, సత్య శీలా రెడ్డి, సిబ్బంది కుమార్, రవి కుమార్, మహిపాల్, హరీష్ కుమార్ లను
సీఐ జీ. నర్సయ్య అభినందించారు.
