డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ సీఎంపిఎఫ్ పెన్షనర్ల కొరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్ ల నిర్వహణ- ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 12_) కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.0 లో భాగముగా దేశవ్యాప్తంగా అన్ని సంస్థల పెన్షనర్స్ లో "డిజిటల్ సాధికారత" పెంచాలనే ఉద్దేశం తో పెన్షనర్స్ అందరూ తమ ఆండ్రాయిడ్ మొబైల్ నుండే మొటైల్ అప్పికేషన్ ద్వారా సిఎంపిఎఫ్/ సిపిఆర్ఎంఎస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు అవగాహన కల్పించేందుకు క్యాంపులను నిర్వహించవలసినదిగా ఆదేశించారు.
దానికి అనుగుణంగా సింగరేణి సంస్థ కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థల ఆధ్వర్యంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్ లను నిర్వహించబోతున్నారుఅని ఇందులో భాగముగా కొత్తగూడెం ఏరియాలో తేదీ. 14.11.2025 నాడు ఉదయం 10.00 గం || లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్ ను ఆర్.సి.ఓ.ఏ క్లబ్, రుద్రంపూర్, కొత్తగూడెం ఏరియా నందు నిర్వహించడం జరుగుతుంది.
కావున, సిఎంపిఎఫ్ పెన్షన్ పొందుతున్న సింగరేణి మాజీ ఉద్యోగులు మరియు సిపిఆర్ఎంఎస్ కార్డ్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని,
ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా ఐ ఎన్ టి యు సి యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎం డి రజాక్ కొత్తగూడెం ఏరియా లోని సింగరేణి మాజీ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రకటనలో తెలిపారు.
