సత్య సాయిబాబా జయంతి శత జయంతి ఉత్సవాలు

On
సత్య సాయిబాబా జయంతి శత జయంతి ఉత్సవాలు

 

నారాయణపేట జిల్లా / నమస్తే భారత్

మానవత్వానికి మారుపేరుగా సత్య సాయి బాబా నిలిచారని ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. ఆదివారం,సత్య సాయిబాబా జయంతి సందర్భంగా శత జయంతి ఉత్సవాలను ఆదివారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో  అధికారికంగా నిర్వహించారు. ప్రజావాణి హాల్లో భగవాన్ సత్యసాయి బాబా చిత్రపటానికి ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. సాయిబాబా చేసిన సేవలను కొనియాడారు. జిల్లాలో ఏర్పడిన నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యేక పంపులను ఏర్పాటు చేసి తాగు నీటిని అందించిన మహనీయుడన్నారు. ప్రభుత్వం ఎలాగైతే ఉచిత పథకాలను అందిస్తుందో అలాగే భగవాన్ సత్య సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్య వైద్యం ఇతర సేవకార్యక్రమాలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో ఏవో శ్రీధర్, డి వై ఎస్ ఓ వెంకటేష్ , శివరాజ్, విజయ్ కుమార్ కనిగిరి, మాజీ కౌన్సిలర్ మారుతీ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

తుగ్గలి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి తుగ్గలి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి
    తుగ్గలి24(నమస్తే భారత్): తుగ్గలి మండలంలోని ఏ గ్రామంలో అయినా సొంత ఇల్లు లేని వారు ఈనెల నవంబర్/30 వ తేదీ లోపల మీ సచివాలయంలోని ఇంజనీరింగ్
సత్య సాయిబాబా జయంతి శత జయంతి ఉత్సవాలు
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్:ఎస్పీ డాక్టర్ వినీత్
గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100% గిరిజనులు ఉన్న పంచాయితీలను గిరిజనులకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం జాదవ్ రమేష్ నాయక్
హలో మాల చలో ఢిల్లీ సభ విజయవంతం చేయాలి
పెద్ద తుప్పర గ్రామానికి చెందిన సాయిబాబాకు గణిత శాస్త్రంలో  డాక్టరేట్ 
మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

Advertise