గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం

On
గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం

 

నమస్తే భారత్ :-తొర్రూరు

కంటయపాలెం గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మోకాటి సుజాత వెంకన్న అన్నారు.కంటయపాలెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు,కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు మోకాటి సుజాత వెంకన్నను బలపరచడంతో శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఆదుకుంటానన్నారు. ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డిల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాలం ఉపేందర్,మందపురి కుమారస్వామి,ఎనగందుల శ్రీనివాస్, గోనే ప్రవీణ్,బానోత్ నరసింహ నాయక్,సాయిలు, ఇదునూరి యాకయ్య,మార్క వెంకన్న,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి కలెక్టరేట్ ముందు 12న జరిగే అంగన్వాడీల ధర్నాను విజయవంతం చేయండి
  :- (సిఐటియు)  పత్తికొండ డిసెంబర్ 05( నమస్తే భారత్):- ఈనెల 12న కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు  అంగన్వాడీల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాలి
తుగ్గిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న
వెంకటాపురంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు 
అభివృద్ధి పేరుతో కాంట్రాక్టు పనులకు శంకుస్థాపనలేనా ?
గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం

Advertise