ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
On
నమస్తే భారత్ :-తొర్రూరు
పదిలో ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేయాలని జీఈసీఓ విజయకుమారి తెలిపారు.డివిజన్ కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను శనివారం జి ఈ సి ఓ సందర్శించారు.స్టోర్ రూమ్, వంటగది, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.
అసంపూర్తి పనులు పరిశీలించి సూచనలు చేశారు.తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని ఎస్ ఓ ను ఆదేశించారు.ఈ సందర్భంగా జి ఈ సి ఓ మాట్లాడుతూ.పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థులు క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి బి. శైలజ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
