తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

On
తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

 

రైతులను, కూలీలను ఆదుకోవాలి  సిపిఎం మండల కార్యదర్శి జి శ్రీరాములు, రంగరాజు

 తుగ్గలి25(నమస్తే భారత్):
 తుగ్గలి లోని ఎంపీడీవో ఆఫీస్ నందు సర్వసభ సమావేశం జరుగుతున్న సందర్భంగా సిపిఎం మండల నాయకులు ఎంపీడీవో విశ్వ మోహన్ గారికి తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు,ఖరీఫ్ లో అతివృష్టి,అనావృష్టి వల్ల తుగ్గలి మండల వ్యాప్తంగా వివిధ పంటలు సాగుచేసిన రైతంగం పూర్తిగా నష్టపోవడం జరిగిందని. ఈ రైతన్న ఆదుకునేందుకు తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ మంగళవారం సిపిఎం నాయకులు స్థానిక  ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విశ్వమోహన్ కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం  మండల కన్వీనర్ జి, శ్రీరాములు మాట్లాడుతూ, ప్రభుత్వం  పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా అదనపు పని దినాలు కలిపించాలని సిపిఎం  మండల కన్వీనర్ జి, శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ ఖరీఫ్ లో  సాగు చేసిన పంటలు వేరుశనగ, పత్తి, కంది, ఆముదం ఇతర పంటలు 
 ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలు ఎక్కువ కురవడం వల్ల పూర్తిగా దెబ్బ తిన్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం స్పందించి  తుగ్గలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి, నష్టపరిహారం వెంటనే విడుదల చేసి తుగ్గలి మండల రైతాంగాన్ని ఆదుకోవాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ ద్వారా అదనపు పని దినాలు కల్పించి 600 రూపాయలకు తక్కువ కాకుండా వేతనం అమలయ్యేటట్టు చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ జి శ్రీరాములు సిపిఎం నాయకులు రంగరాజు, 
సీనియర్ నాయకులు 
 తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise