వందేమాతరం గీతం – 150 సంవత్సరాల గౌరవోత్సవం
On
నమస్తే భారత్:- హైదరాబాద్
---బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్
మహంకాళి – సికింద్రాబాద్ జిల్లా తోలుపునూరి రమేష్ గౌడ్
మంగళవారం కవాడిగూడ డివిజన్లోని చిత్రాల్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో వందేమాతరం గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఘనంగా కార్యక్రమం జరిగింది. ప్రముఖ జాతీయ నాయకులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు (ఎం.పి) శ్రీ డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ , ముషీరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గురువులు, విద్యార్థులు అందరూ కలిసి దేశభక్తి గీతం వందేమాతరాన్ని ఘనంగా ఆలపించారు. విద్యార్థుల ఉత్సాహం మధ్య దేశమాత పట్ల గౌరవంతో మార్మోగిన వందేమాతరం స్వరాలు దేశభక్తిని ప్రతిధ్వనింపజేశాయి. ఇలాంటి అద్భుత ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
Tags
Related Posts
Latest News
02 Apr 2026 22:08:44
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్హెచ్ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
