ఐ ఐ టీ & నీట్ అకాడమీ కరపత్రాన్ని విడుదల చేసిన
బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్25:షాద్ నగర్ పట్టణంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి కార్యాలయంలో ఐఐటీ & నీట్ అకాడమీకి సంబంధించిన కరపత్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి విడుదల చేయడం జరిగింది.
విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ
షాద్ నగర్ లో నేటి వరకు ఐఐటీ,జె ఈ ఈ,నీట్ కోర్సులకు సంబంధించిన ఒక్క అకాడమీ కూడ ఇప్పటివరకు లేదు కనుక ఈ ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఐఐటి ,నీట్ కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ కు వెళ్లడం జరిగేది కాబట్టి
ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుండి హైదరాబాద్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ విఐఐటి, జె ఈ ఈ, అకాడమీ సౌజన్యంతో షాద్ నగర్ పట్టణంలో ఐఐటి నీట్ కోర్సులకు సంబంధించిన అకాడమీ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అని అన్నారు. ఈ యొక్క సదరు అవకాశాన్ని షాద్ నగర్ నియోజకవర్గ విద్యార్థులుసద్వినియోగపరచుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో ఆలూరు దేవేందర్ ,నవనీత రెడ్డి , బావు నాయక్,ప్రవీణ్ ,యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
