ప్రభుత్వ ఆసుపత్రికి  వచ్చేది పేద ప్రజలే

On
ప్రభుత్వ ఆసుపత్రికి  వచ్చేది పేద ప్రజలే

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ  లక్ష్యం

గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్టు నెలకు 1000 రూపాయలు ఇచ్చే డబ్బులు  ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు

ఇప్పుడున్న భవనం శిథిలావస్థకు చేరింది

కొద్దిపాటి వర్షం పడితే చాలు భవనం మొత్తం  కురుస్తూ పేచ్చులు ఊడి పేషంట్లపై పడే పరిస్థితి

తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత

షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కవిత

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్20:ప్రభుత్వ ఆసుపత్రికి  వచ్చేది పేద ప్రజలే కనుక  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ కిట్టు నెలకు 1000 రూపాయలు ఇచ్చే డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. షాద్ నగర్ పట్టణంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తయినా కూడా ఇంకా పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ కి మార్చలేదన్నారు. ఈ ఆస్పత్రి సందర్శించాక తాను ఇక్కడున్నా సమస్యలు గుర్తించడం జరిగిందని ఇప్పుడున్న భవనం శిథిలావస్థకు చేరిందని కొద్దిపాటి వర్షం పడితే చాలు కురిసే పరిస్థితి, పేచ్చులు ఊడి పేషంట్లపై పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది ఇదె జిల్లా కనుక ఈ ఆస్పత్రి పై దృష్టి పెట్టి  వెంటనే స్పందించి శిథిలమైన భవనాన్ని వెంటనే వంద పడకల ఆసుపత్రికి మార్చాలని, అదేవిధంగా డాక్టర్ల, సిబ్బంది కొరత ఉందని  నాణ్యమైన వైద్య సేవల కోసం సిబ్బంది సంఖ్య పెంచాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో  స్థానిక నాయకులు పాండు రంగారెడ్డి,  ముస్తఫా, సీమ రమేష్ తో పాటు జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise