58,వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు బహుమతి ప్రధాన కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ అబ్దుల్లా రెహ్మాన్..
నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 20_) జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 58 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ముగింపు కార్యక్రమం జరిగినది ఈ ముగింపు కార్యక్రమానికి వివిధ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధాన ఉత్సవం జరిగినది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు
కార్యక్రమ ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ రెహమాన్ అబ్దుల్లా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. టి పి సి సి కార్యదర్శి నాగ సీతారాములు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు తోట దేవి ప్రసన్న గ్రంథాలయ కార్యదర్శి కే. కరుణ కుమారి పాల్గొన్నారు గత వారం రోజులు జరిగిన వివిధ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు పాల్గొని బహుమతులు పొందారు బహుమతులు పొందిన చిన్నారులను ఉద్దేశించి రెహ్మాన్ మాట్లాడుతూ మీరు శ్రద్ధగా చదివి మంచి పేరు తెచ్చుకోండి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు సమాజానికి ఆదర్శంగా నిలవండి ఈ పోటీలలో పాల్గొని మీలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి మాత్రమే గ్రంథాలయాలలో పోటీలలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఆశీర్వాదాలు తెలియజేశారు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని వైఫై ఫోన్లో సెల్ఫోన్లో చూడటం వలన సమయం వృధా అవుతుందని చిన్నతనం నుంచి పుస్తక పాఠనా అలవాటు చేసుకోవాలని ఇలా అలవాటు చేసుకున్న వారు తప్పనిసరిగా ఒక ఉన్నత స్థానంలో ఉంటారని అందుకు కష్టపడాలని సూచించారు ఈ సందర్భంగా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు బహుమతిని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్ కుమార్ గ్రంథపాలకురాలు చేయమని మృదుల మధుబాబు వంశీకృష్ణ వాణి రుక్మిణి గీత గ్రంథాలయ సిబ్బంది కాంగ్రెస్ యువజన నాయకుడు ఈశ్వర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.
