షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్ లో ముగిసిన స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం

On
షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్ లో ముగిసిన స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం

 

స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో పలు కేసులు రాజీ

కేసుల పరిష్కారంలో పోలీసులు మరియు న్యాయవాదులు

సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందించిన అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు మండలం న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ స్వాతి రెడ్డి

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్15:వివిధ కేసుల పరిష్కారం దిశగా సాగిన లోక్ అదాలత్ కార్యక్రమం అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ స్వాతి రెడ్డి ఆదేశాలతో ప్రారంభమై ఈరోజు సాయంత్రం ముగిసింది.  స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ స్వాతి రెడ్డి తో పాటు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పట్టణ న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజీమార్గమే రాజమార్గంగా సాగిన స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో  కక్షిదారులు పాల్గొని వివిధ క్రిమినల్ కేసులలో రాజీ కుదుర్చుకున్నారు. ప్రత్యేకంగా సాగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో  నేరం ఒప్పుకున్న కేసులకు గాను 92 క్రిమినల్ కేసులు పరిష్కారం కాగా, 71 క్రిమినల్ కేసులలో కక్షిదారులు రాజీ కుదుర్చుకుని కేసులను పరిష్కరించుకోగా మొత్తం 163 క్రిమినల్ కేసులు పరిష్కరించబడ్డాయి.. స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా కేసుల పరిష్కారానికి చొరవ చూపిన న్యాయవాదులను మరియు పోలీసులను, కోర్టు సిబ్బందిని అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ స్వాతి రెడ్డి అభినందించారు.

Tags

Share On Social Media

Latest News

జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి. జేజమ్మకు కేంద్రం కీలక బాధ్యతలు- బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి.
    - భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025 జాయింట్ పార్లమెంటరి కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి Dk.అరుణమ్మ గారిని నియమించినందుకు ప్రధాన
అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
బాల్యవివాహాలు చట్టవిరుద్ధం – అమ్మాయిల విద్యాభద్రత పై అవగాహన
ఊరట్టం గ్రామపంచాయతీ ఘనంగా బిర్సా ముండా150 జయంతి వేడుకలు
భగవాన్ బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం  తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్ 
ఎంపీ డి కె అరుణ కు స్వాగతం పలికిన నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు సుంకు ఉమేష్ కుమార్
మేడారం సమ్మక్క సారాలమ్మ దీవెనలతో మండపు లక్ష్మన్ రాజు (రెడ్డిగూడెం)

Advertise