ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి* 

On
ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి* 

 

నారాయణపేట్ జిల్లా :తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని  నారాయణపేట  జిల్లా కలెక్టరేట్ లో  ఈ నెల 17 న  ఉదయం 10 గంటలకు నిర్వహించే జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరై  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని  కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళ  వారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణలో ఎవరికి ఇచ్చిన బాధ్యతలను  వారు సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా ఆమె లైన్ డిపార్ట్ మెంట్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టరేట్ ఏవో జయసుధ, ఆర్డీఓ రామచంద్రనాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About The Author

Advertise

Error on ReusableComponentWidget

Latest News

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్
శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ...
దేవి శరన్నవరాత్రి సందర్భంగా ముస్తాబైన దేవాలయాలు
రోడ్డు ఆక్రమణలు కూల్చివేత - రహదారి విస్తరణ ప్రారంభం
హైడ్రా పై రాళ్ల దాడి - గాజులరామరంలో బుల్డోజర్ యాక్షన్
ప్రాణాలు కాపాడండి సారు ! 
ఊరెళ్తున్నారా..జరభద్రం
ప్రమాదాల నుండి రక్షించండి

Advertise