దళిత ఆత్మగౌరవ సభ: జస్టిస్ గవాయిపై దాడిని నిరసిస్తూ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ ధర్నా!
నమస్తే భారత్ , నవంబర్, 17,శంషాబాద్ ఎమ్మార్పీఎస్ నేతల క్రియాశీలక భాగస్వామ్యం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి గారిపై జరిగిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ దాడిని దేశంలోని కోట్ల మంది దళిత ప్రజలపై జరిగిన దాడిగా పేర్కొంటూ, ఎమ్మార్పీఎస్. ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ దళిత ఆత్మగౌరవ సభ నిర్వహించబడింది.
దళితులపై దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించకపోవడం అత్యంత దారుణమని ఎమ్మార్పీఎస్, అధ్యక్షులు చిన్న చిన్న గండు, భాస్కర్, మాదిగ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ధ్వజమెత్తారు.
✊ నిరసన ర్యాలీలో పాల్గొన్న శంషాబాద్ ఎమ్మార్పీఎస్ నాయకులు
ఈ నిరసన ర్యాలీలో ఎమ్మార్పీఎస్ నాయకులు క్రియాశీలకంగా పాల్గొని, గవాయి గారికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. పాల్గొన్న ముఖ్య నాయకుల వివరాలు:
కొత్తూరు రమేష్ మాదిగ,
శంకర్రావు,మాదిగ
మంగళవారం రత్నం,మాదిగ
పోతురాజు యాదయ్య మాదిగ,
నాన్నగారి రామచందర్ మాదిగ,
చిన్నగాడు భాస్కర్ మాదిగ,
పోతుగల రాజు మాదిగ,
ఎర్ర నిఖిల్ మాదిగ,
వారు మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం అరికట్టాలని, జస్టిస్ గవాయిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
