చిన్నారుల అదృశ్యం కేసుల‌పై సుప్రీంకోర్టు ఆందోళ‌న‌

On
చిన్నారుల అదృశ్యం కేసుల‌పై సుప్రీంకోర్టు ఆందోళ‌న‌

న్యూఢిల్లీ: దేశంలో ప్ర‌తి 8 నిమిషాల‌కు ఓ చిన్నారి అదృశ్యం అవుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల ప‌ట్ల సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇది చాలా సీరియ‌స్ స‌మ‌స్య అని కోర్టు పేర్కొన్న‌ది. జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న‌, ఆర్ మ‌హాదేవ‌న్‌తో కూడిన ధ‌ర్మాస‌నం చిన్నారుల అదృశ్య కేసుల‌పై రియాక్ట్ అయ్యింది. దేశంలో ద‌త్త‌త ప్ర‌క్రియ చాలా సంక్లిష్ట‌త‌రంగా ఉన్న‌ద‌ని, ఆ ప్ర‌క్రియ‌ను వీలైనంత త్వ‌ర‌గా స‌క్ర‌మంగా మార్చాల‌ని కోర్టు చెప్పింది. ఓ న్యూస్‌పేప‌ర్‌లో చ‌దివాన‌ని, దేశంలో ప్ర‌తి 8 నిమిషాల‌కు ఓ చిన్నారి అదృశ్యం అవుతున్నార‌ని, దీంట్లో ఎంత నిజం ఉందో లేదో తెలియ‌ద‌ని, కానీ ఇది సీరియ‌స్ అంశ‌మ‌ని జ‌స్టిస్ నాగ‌ర‌త్న అన్నారు. ద‌త్త‌త ప్ర‌క్రియ సుదీర్ఘంగా ఉన్న కార‌ణంగా, దాన్ని అతిక్ర‌మిస్తున్నార‌ని, పిల్ల‌ల కోసం అక్ర‌మ విధానాలు ఆచ‌రిస్తున్నార‌ని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది. 

Tags

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise