అంటూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

On
అంటూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

 

ప్రిన్సిపాల్ డాక్టర్ సంగి రమేష్.

మహేశ్వరం, డిసెంబర్ 1, నమస్తే భారత్ న్యూస్ ప్రతినిధి:

అంటూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సంగి రమేష్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ కళాశాల మహేశ్వరం లో  ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని చేతులు కలపడం ద్వారానో భోజనం తినడం కలిసి తినడం ద్వారానో అంటుకోదని ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని వారందరూ అనేక రకాల అవమానాలు మాటల వలన గాయపడుతున్నారని ఆయన చెప్పారు. మంచి మందుల ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణ ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.  ఎయిడ్స్ 2025  ప్రకారం యువత ద్వారా మరింత ఎక్కువ అవగాహన కార్యక్రమాలు జరగాలని  డ్రగ్స్ ద్వారా,అనైతిక సంబంధాల ద్వారా వ్యాపించే ఎయిడ్స్ ను అరికట్టాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారిని డాక్టర్ జహీదా బేగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఎయిడ్స్ కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞను చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ ఉపేందర్,శ్రీదేవి, డాక్టర్ ఫర్హాద్, నరేందర్ రెడ్డి, చిన్నజీ, ప్రవళిక కుమార్, సునీత,సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise