పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం
నమస్తే భారత్ :-తొర్రూరు : పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన స్థానిక సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం సత్కరించింది. సోమవారం డివిజన్ కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ లో పది లో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ హర్ష, అక్షిత్, గంగోత్రి లను పాఠశాల చైర్మన్ ముత్తినేని సోమేశ్వరరావు, పాఠశాల కరస్పాండెంట్ ముత్తినేని జయప్రకాష్ లు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు. సిద్ధార్థ హై స్కూల్.100 శాతం ఫలితాలతో తిరుగులేని పాఠశాలగా నిలిచింది. మొత్తం 17 మంది విద్యార్థులు పరీక్ష రాయగా దానిలో 10 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించగా, 7 మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా సాధించారు. మండలంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచారు.ఈ సందర్భంగా చైర్మన్ సోమేశ్వర రావు, కరస్పాండెంట్ జయప్రకాష్ మాట్లాడుతూ...గత కొంతకాలంగా సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, వారు మంచి ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం ఉందన్నారు. పాఠశాలలో విలువలతో కూడిన విద్య అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను వృద్ధిలోకి తీసుకురావడమే పాఠశాల లక్ష్యమని తెలిపారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
