ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

నమస్తే భారత్  నారాయణపేట్ జిల్లా : ఈరోజు జరిగిన  ప్రజావాణి ఫిర్యాదులు- 32
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణి ఆశ్రయిస్తున్నారని, వారి దరఖాస్తులను సత్వరమే  పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణి పోర్టల్ లోని పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని ఆదేశించారు.ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 32 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు ఇతర శాఖలకు సంబంధించినవి 32 దరఖాస్తుల స్వీకరించగా  వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్, ఆర్డీవో రామచందర్ వివిధ జిల్లా స్థాయి అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఐ మాక్స్ లైట్ల ప్రారంభం ఐ మాక్స్ లైట్ల ప్రారంభం
నమస్తే భారత్ /  మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్  తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...
పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం
వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
రాజేంద్రనగర్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి  పట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి  జన్మదిన వేడుకలు
మహిళా చట్టాలపై మహిళలు ఉండే ప్రదేశానికి వెళ్లి  అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న సిద్దిపేట షీటీమ్ బృందం  
కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కారీ గారికి శాలువ కప్పి స్వాగతం పలికిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్.