నిర్మల్ పోలీస్.. మీ పోలీస్..
జూన్ 14 న అన్ని న్యాయ స్థానాలలో జరగబోవు జాతీయ లోక్ అదాలత్ గురించి జిల్లా పోలీస్ అధికారులతో ఆన్లైన్ లో సమీక్ష సమావేశం : జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఐ.పి.యస్.
తేదీ, 05.05.2025
నమస్తే భరత్
జూన్ 14 న జరుగబోవు జాతీయ లోక్ అదాలత్ దృష్టిలో ఉంచుకుని సోమవారం నిర్మల్ జిల్లా ముఖ్య కార్యాలయం లో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ జిల్లాలోని పోలీస్ అధికారులతో మరియు కోర్టు పోలీస్ అధికారులతో ఆన్లైన్ లో దిశా నిర్దేశాలు చేసారు. వివాదాలు మరియు రాజీ పడే క్రిమినల్ కేసులు, పెండింగ్లో ఉన్న టూ వీలర్ & ఫోర్ వీలర్ చలాన్ కేసులు మరియు పెట్టీ కేసులు మొదలైన వాటికి సంభందించిన కేసులను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కక్షి దారులందరికి సమాచారం అందించి ఈ సదవకాశాన్ని వినియోగించుకావాలని తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో కేసు పరిష్కారం ద్వారా వారి యొక్క సమయం మరియు డబ్బును ఆదా చేసుకోగలరనీ తెలపాలన్నారు. ఈ లోక్ అదాలత్ లో పరిష్కారానికి అవకాశం ఉన్న కేసుల వివరాలు తయారు చేసుకుని తగిన వారందరికీ సమాచారం అందేలా చూడాలని తెలియజేసారు. ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేల వారికి కేసుల గురించి వివరించాలని తెలిపారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

