ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తా
ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ను సన్మానించిన నాయకులు
నమస్తే భారత్ :-తొర్రూరు: ముదిరాజ్ కార్పొరేషన్ ద్వారా కేటాయించిన బడ్జెట్ నిధుల ద్వారా ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలంగాణ ముదిరాజ్ కో- అపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. శనివారం మండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా వచ్చిన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ను మండల కేంద్రంలోని తొర్రూరు మండల ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమం కోసం కేటాయించే నిధుల నుండి జిల్లాలో ఉన్న ముదిరాజుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. నష్టపోయిన మత్స్య కార్మికులకు ప్రభుత్వం ఆదుకునే విధంగా కృషి చేస్తానన్నారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు గొడుగు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో అకాల వర్షాలతో చెరువులు, కుంటలు తెగి తీవ్ర నష్టంతో ఉన్న ముదిరాజ్ మత్యకారులను ఆదుకోవాలని, ఆర్థిక సహాయ సహకారలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా వారు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ చెర్లపాలెం సొసైటీ సెక్రటరీ పులుగుజ్జ మహేష్ ముదిరాజ్, దంతాలపల్లి ప్రధాన కార్యదర్శి సాదు రాములు ముదిరాజ్, భాషబోయిన పూర్ణచేందర్, పులుగుజ్జ రామచంద్రు ముదిరాజ్, కాగు నవీన్ ముదిరాజ్ పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
