కులగణన హామీకి మద్దతుగా మోదీ కి పాలాభిషేకం 

 బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి ఘన పాలాభిషేకం 

కులగణన హామీకి మద్దతుగా మోదీ కి పాలాభిషేకం 

నమస్తే భారత్,షాద్ నగర్ మే03: బీజేపీ పట్టణ అధ్యక్షులు హరి భూషణ్ పటేల్ ఆధ్వర్యంలో  బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చినందున దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం షాద్ నగర్ మున్సిపాలిటీలోని 9వ వార్డు లో ఈడెన్ ప్లాజా ముందు, 8వ వార్డు ఆర్టీసీ కాలనీ లో,4వ వార్డు చటానపల్లి రైల్వే గేట్ దగ్గర, జానంపేట గాంధీ విగ్రహం దగ్గర షాద్ నగర్ ముఖ్య కూడలి లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ మల్చల మురళి మాట్లాడుతూ దేశాన్ని గర్వంగా తీసుకెళ్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  చిత్రపటానికి పాలాభిషేకం చేయడం మన దేశంలో ఎన్నో దశాబ్దాలుగా పేదలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్నివర్గాలు అసలు ఎన్ని మంది ఉన్నారో తెలియకపోవడం మనకే కాదు, దేశ రాజ్యాంగానికే అవమానం. ఈ పరిస్థితిని మార్చాలంటే కచ్చితమైన కుల గణన అవసరం.మిత్రులారా, కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు కేవలం ఓటు కోసం వెనుకబడిన వర్గాల పేరు వాడాయి. కానీ మోదీ మాత్రం నమ్మకంగా, హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారు. దేశం మొత్తం మీద ఒక సామాజిక న్యాయ యుగాన్ని తీసుకురావాలనే సంకల్పంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం చెప్పుకోవాలి – దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రధాని, పార్లమెంటు మట్లాడుతున్న సమయంలో “కుల గణన చేస్తాం” అని స్పష్టంగా హామీ ఇచ్చాడు. ఇది మాటకే పరిమితం కాదు. మోదీ హామీ ఇచ్చిన ప్రతి విషయాన్ని అమలు చేశారు.ఈ కుల గణన ద్వారా కేంద్రం నిత్యహక్కులు పొందని వర్గాల పరిస్థితిని అర్థం చేసుకుని, తగిన విధంగా పాలనా విధానాలు రూపొందించగలదు. ఇది తాత్కాలిక గణన కాదు. ఇది సామాజికంగా వెనుకబడిన వారికి శాశ్వత న్యాయం చేసే మార్గం.ఈ కార్యక్రమం ద్వారా మనం చూపాలనుకున్నది ఒకే విషయం – మోదీ కి మా సంఘీభావం, మేమూ ఈ మహాయజ్ఞంలో భాగమవుతున్నాం అన్నదే. ప్రతి ఓబీసీ యువకుడు, ప్రతి బీజేవైఎం కార్యకర్త, ప్రతి బీజేపీ నాయకుడు ఈ ఆశయంతో ముందుకు పోవాలి.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్, వంశీకృష్ణ, మండల అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చెట్ల వెంకటేష్ ఓబీసీ మచ్చ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చారి, సుధాకర్ అప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శి జంబుల నరసింహ, మల్చలం రాము, పసిలోటి శ్రావణ్, శివశంకర్, గజ్జల ప్రవీణ్, బాల్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి,సందీప్ యాదవ్,కొంకళ్ళ మణికంఠ, లింగారం సాయి గౌడ్,గటోజ్ విజయ్ సురేష్ ఆంజనేయులు, రాజు, శ్రీనాథ్, శ్రీహరి, రామకృష్ణ, వంశీ, e.రాజు, గోపి, శ్రీకాంత్, రవి మరియు బిజెపి నాయకులు మోడీ అభిమాను లు తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం. ఆవిష్కరణ కు ముందే.దర్శనం ఇచ్చిన నూకల విగ్రహం.
నమస్తే భారత్ :-మహబూబాబాద్ : మహబూబాబాద్-మరిపెడ జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన మాజీమంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణకు ముందే ప్రజలకు దర్శనం ఇస్తోంది.ఇటీవల గాలిదుమ్ములకు విగ్రహానికి కప్పి...
పేదలకు దక్కని ఇందిరమ్మ ఇల్లు 
ముదిరాజ్ ల సంక్షేమం కోసం కృషి చేస్తా
తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్  మొదటి  సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.
సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
దేవయ్య చిత్రపటానికి నివాళులర్పించిన   సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాలా వీరయ్య 
కేంద్ర ప్రభుత్వం కులగన లెక్కల నిర్ణయం శుభ పరిణామం