భూభారతి చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

భూభారతి చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన భూభారతి చట్టం (ఆర్వోఆర్ చట్టం–2025) ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

తేదీ, మే 05, 2025- 
నమస్తే భరత్  సోమవారం  నిర్మల్:- జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు వేదికలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ అభిలాష్ అభినవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని, ఈ చట్టం అమలుతో ధరణి చట్టానికి ముందున్న సాధాబైనమా ప్రక్రియ తిరిగి వినియోగంలోకి రానుందని తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే తహసిల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. నూతన చట్టం ప్రకారం భూ సమస్యలపై ప్రజలు దరఖాస్తు చేస్తే, సంబంధిత అధికారులు నిర్ణిత గడువులోగా విచారించి, పరిష్కార చర్యలు చేపడతారని పేర్కొన్నారు. నేటి నుండి కుంటాల మండలంలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయని, ప్రజల నుంచి భూసంబంధిత దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.   అనంతరం సదస్సులో పాల్గొన్న ప్రజలు, రైతుల సమస్యలను కలెక్టర్ స్వయంగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ అవగాహనా సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సందీప్ కుమార్, తహసిల్దార్ రాజు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఐ మాక్స్ లైట్ల ప్రారంభం ఐ మాక్స్ లైట్ల ప్రారంభం
నమస్తే భారత్ /  మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్  తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...
పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం
వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
రాజేంద్రనగర్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి  పట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి  జన్మదిన వేడుకలు
మహిళా చట్టాలపై మహిళలు ఉండే ప్రదేశానికి వెళ్లి  అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న సిద్దిపేట షీటీమ్ బృందం  
కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కారీ గారికి శాలువ కప్పి స్వాగతం పలికిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్.