త్వరిత పరిష్కారమే లక్ష్యంగా ప్రజావాణి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
తేదీ, మే 05, 2025-
నమస్తే భారత్
నిర్మల్:-పట్టణంలోని
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా వచ్చిన ప్రజల విజ్ఞప్తులు కలెక్టర్ స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూసమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల అంశాలపై ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్. మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని, శాఖలవారీగా పెండింగ్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా సిద్ధం చేయాలని, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన తక్షణమే పూర్తిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో అవసరమైన మరమ్మత్తులు చేపట్టి సమయానికి పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులంతా సమయపాలన పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణిలో 91005 77132 నంబరుకు కాల్ చేసి ప్రజలు తమ సమస్యలు తెలియజేయాలని, వాట్సప్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చని కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

