సారయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

నమస్తే భారత్ :-తొర్రూరు : మండలంలోని గోపలగిరి గ్రామానికి చెందిన అనుమాల సారయ్య ఇటీవల ఆకస్మికంగా మృతి చెందాడని,ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జాతీయ కార్యదర్శి అష్శోద భాస్కర్ లు అన్నారు. శనివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ నా చిన్ననాటి మిత్రుడు సారయ్య మృతి తీరని లోటన్నారు.ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలు వారి కుటుంబానికి చెందిన కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల మహేష్, జిల్లా యూత్ నాయకులు ఎనమాల రాకేష్ , నాయకులు ఎనమాల సుధాకర్, రజిత,కేషయ్య,విజయ్, యాకూబ్, బాబు శ్రీనివాస్, ఆయుర్వేదిక్ డాక్టర్ రవి, లక్ష్మీ ప్రసన్నకుమార్, బన్నీ,రాణా కీర్తి లక్ష్మి,మనో, మల్లయ్య, సుభాష్,లలిత, మరియమ్మ,సన్నీ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Latest News
