గన్ని బస్తాల కోసం రైతులకు తప్పని తిప్పలు Ex ఎంపీటీసీ కిరణ్ కుమార్
నమస్తే భారత్ / ఉట్కూర్ మండలం
---జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరి కోసం పని చేస్తున్నరు
---సీఎం జిల్లాలో రైతుల కష్టాలు ఎమ్మెల్యేలకు పట్టవా,
---రైతులను ఇబ్బందులు పెడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి.
---ఓట్లప్పుడే రైతులు గుర్తోస్తరా
---ప్రజా పాలనలో రైతులకు తప్పని గోసలు
---గన్ని బస్తాల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి రావడం దారుణం
రైతులకు గన్ని బస్తాలు అందుబాటులో లేక ,పండించిన ధాన్యం అమ్మటానికి మిలర్ల నుండి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యే లు ఏం చేస్తున్నారని నారాయణ పేట జిల్లా దిశ మెంబర్ ex ఎంపీటీసీ కిరణ్ కుమార్ ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రైతులు గన్ని బస్తాల కోసం రొడ్లెక్కే పరిస్థితి రావడం అత్యంత దారుణమన్నారు.ఒక పక్క రైతులు పండించిన పంటలను రైస్ మిల్లర్లు కొనుగోలు చేయక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే కనీసం సమస్యను పరిష్కరించే ధ్యాస ప్రజా పాలన ఎమ్మెల్యే లకు లేకపోవడం దురదృష్టకరమన్నారు.ఓట్లప్పుడే రైతులు,ప్రజలు గుర్తొస్తరా అంటూ ప్రశ్నించారు.ప్రజల పాలన అంటూ నిరంతరం ఆర్భాటాలు చేయడం తప్ప ప్రజా,రైతు సమస్యలు పరిష్కరించే సోయి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు.తక్షణమే రైతులకు గన్ని బస్తాలు అందుబాటులో ఉంచి,రైతులను ఇబ్బందులు పెడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

