దేవయ్య చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాలా వీరయ్య
నమస్తే భారత్ :-మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ళు ఊకల్ గ్రామనీకి చెందిన కామ్రేడ్ పుల్లూరు దేవయ్య సంస్కరణ సభ ను ఉద్దేశించి ముఖ్యఅతిథిగా పాల్గొన్నా కామ్రేడ్ అల్వాల్ వీరయ్య మాట్లాడుతూ, కా దేవయ్య ఉన్నంతకాలం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు, ఊకలూ గ్రామంలో అనేక మందికి ఉపాధి హామీ కార్డులు ఇప్పించారని, ఉపాది హమీ పనిలో జరిగిన అవకతవకులనూ వెలికి తీసి, ఎప్పటికప్పుడు గ్రామంలో పేదలకి ఉపాధి పనులు డబ్బులు పడేలా చూసేవారు అని గుర్తు చేశారు, గ్రామీణ పేదలకు పెన్షన్స్ ఇవ్వాలని ఆందోళన నిర్వహించే వారిని చెప్పారు, దేవన్న పార్టీ నుంచి వారి కుటుంబానికి దూరమైన మా హృదయలల్లో ఎప్పడికి నిలిచి ఉంటారని వీరన్న గుర్తు చేశారు, దేవన్న ఇప్పుడు లేరూ అన్న విషయాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతుందని ఆయన ఉదయ విధారకం అయ్యారు, భవిష్యత్తులో దేవున్నా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని, దేవన్నా ఆశయాన్ని ముందు తీసుకుపోయేలా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలని వీరన్న పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ పార్టీ ఆర్గనైజర్ బాణాల రాజన్న మండల కమిటీ సభ్యులు బోడ పట్ల రాజశేఖర్ కందల రమేష్ ,కేపీఎస్ మండల కన్వీనర్ బాణాల ఎల్లయ్య దేవన్న సతీమణి పద్మ కుమారుడు క్రాంతి కుమార్, గ్రామ నాయకులు కందుల శ్రీనివాస్ పుల్లూరు నాగరాజు, అల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్వాయి ఎల్లమ్మ లావణ్య,లలిత తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

