మేము సైతం మిత్రమండల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు...
ఆంధ్రప్రభ ఎడిటర్ పసునూరు భాస్కర్ పుట్టినరోజు వేడుకలు
నమస్తే భారత్: మణుగూరు : మేము సైతం మిత్రమండలి ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆంధ్రప్రభ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జనరల్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నిరుపేద కుటుంబాల ఆశాజ్యోతి పసునూరి భాస్కర్ పుట్టినరోజు పురస్కరించుకొని ..... మేము సైతం మీత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆంద్ర ప్రభ వారి ఆధ్వర్యంలో.అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
మణుగూరు మండలం సమితి సింగారం గ్రామం యంఎస్ఆర్ నగర్ లోగల ప్రాథమిక పాఠశాలలో మొక్కలునాటే కార్యక్రమం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లొ వైద్య సేవలు అందుకుంటున్న 90 మంది పేషెంట్లకు పండ్లు బ్రెడ్ పాలు అందించారు. అదేవిధంగ మణుగూరు అమ్మ నాన్న వృద్ధ ఆశ్రమంలో అన్నదానం చేశారు. .ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్రమండలి ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు బేతంచర్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఆంద్ర ప్రభ నియోజకవర్గ ఇన్చార్జి మార్తి శ్రీనివాసరావు, కోశాధికారి రంగా శ్రీనివాస రావు, కార్యనిర్వహణ ఇంచార్జీ చిందుకూరి ఏడుకొండలు, ఉపాధ్యక్షులు మంగి మల్లికార్జున్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాబిన్ పిళ్ళై, అంబులెన్సు డ్రైవర్ ప్రదీప్, ట్రస్ట్ సభ్యులు జగన్ మోహన్, తమ్మిషెట్టి వాసు, చిందుకురి రామారావు, మెడికల్ షాపు సురేష్, డేరంగుల నరసింహ, అమూల్ శ్రీను, లక్షిశెట్టి వీరభద్రమ్, రామచందర్, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
