అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ డివిఆర్ రాజు, కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత నుండి వచ్చిన 8 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు
పోలీస్ కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా భద్రత స్కీమ్
విధినిర్వహణలో మృతిచెందిన పోలీసులకు డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుంది
నమస్తే భారత్ : 2024 డిసెంబర్ నెలలో అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ డివిఆర్ రాజు కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందవలసిన బెనిఫిట్స్ లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత నుండి వచ్చిన 8 లక్షలు చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేసిన పోలీస్ కమిషనర్ మేడమ్ గారు. తదనంతరం వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ప్రతి పైసను జాగ్రత్తగా పిల్లల పేరుపై ఫిక్స్ డిపాజిట్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా మేడమ్ గారు మాట్లాడుతూ విధినిర్వహణలో మృతి చెందిన పోలీస్ కుటుంబ సభ్యులకు డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.రాజు కుటుంబ సభ్యులకు రావలసిన మరికొన్ని బెనిఫిట్స్ త్వరలో అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసీపి రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, బి సూపరిండెంట్ అలీషా పలుషా నిమ్మల, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ రవిరాజు, తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ కార్యాలయము నుండి జారీ చేయనైనది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
