16,01856 లక్షల కల్యాణ లక్ష్మి, 12,30,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం
నమస్తే భారత్: అశ్వాపురం : అశ్వాపురం మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన అశ్వాపురం మండలానికి చెందిన 16 మందికి 16,01856, లక్షల విలువ గల కల్యాణ లక్ష్మి,చెక్కులను అశ్వాపురం మండలంకీ చెందిన సీఎంఆర్ఎఫ్ బ్ధిదారులకు 31మందికి 12,30,000 లక్షల చెక్కును పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ... కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని తెలియజేశారు. మీ కుటుంబంలో ఆడబిడ్డకు పెళ్లి చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధులను అందజేస్తుందని ఈ డబ్బులు జాగ్రత్తగా మీ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని తెలియజేసిన ఎమ్మెల్యే పాయం.ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎమ్మార్వో స్వర్ణ, అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఓరుగంటి బిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మైనార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

