అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి: జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి యస్
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ నారాయణపేట జిల్లా పరిధిలో దొంగతనాల నిర్మూలన గురించి పోలీస్ పెట్రోలింగ్ పెంచడం జరిగింది అని మరియు గ్రామాలలో, పట్టణ కేంద్రంలోని కాలనీలలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చిన అనుమానిత వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీస్ వారికి డయల్ 100 లేదా 24*7 పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్.8712670399 కి, లేదా సంబంధిత లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పూర్తిస్థాయి పెట్రోలింగ్ పెంచడం జరిగిందని పెట్రో కార్ పెట్రోలింగ్, బ్లూ కోట్స్ పెట్రోలింగ్, అలాగే మఫ్టీలో పోలీసులను మరియు టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. దొంగతనాల నిర్మూలనకు పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. అలాగే పాత నేరస్తుల పై నిఘా ఏర్పాటు చేసి ప్రతిరోజు వారిని తనిఖీ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఎవరైనా గ్రామాలలో ఎక్కువ రోజులు ఇండ్లకు తాళం వేసి టూర్లు లేదా బంధువుల ఊర్లకు వెళ్లినచో సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని ఆయ ఏరియాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. గ్రామాలలో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు చేయడానికి భయపడతారని మరియు అసాంఘిక కార్యకలాపాలు నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి గ్రామంలో ప్రజలు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ కోరారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

