మణికొండలో 121.50 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 19న శ్రీకారం: పాల్గొననున్న మంత్రులు, స్పీకర్
నమస్తే భారత్, మణికొండ, బి ప్రభాకర్ ప్రతినిధి నవంబర్ 18):
మణికొండ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం అందించే దిశగా ఈ నెల 19వ తేదీన పలు కీలక పనులకు ఘనంగా ప్రారంభోత్సవం జరగనుంది. మొత్తం రూ. 121.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు , శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , మరియు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే శ్రీ తోలుకంటి ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా, ముఖ్యంగా మూడు ప్రధాన అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్లను ఆవిష్కరించనున్నారు:
రూ. 18 కోట్లతో నిర్మించిన ఆధునిక నూతన మున్సిపాలిటీ భవనం ప్రారంభం.
రూ. 100 కోట్లతో చేపట్టిన కీలకమైన పందెన్ వాగు అభివృద్ధి పనులు.
రూ. 3.50 కోట్లతో రూపొందించిన క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులు.
ప్రారంభోత్సవం అనంతరం, నూతన మున్సిపాలిటీ భవనం ప్రాంగణంలో జరగనున్న ప్రజా పాలనా సభలో ఈ ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను రాజేంద్రనగర్ స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు (నవంబర్ 18) స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు
