ప్రజలభాగస్వామ్యంతో శతవసంతోత్సవాలాను జయప్రదం చేద్దాం

On
ప్రజలభాగస్వామ్యంతో శతవసంతోత్సవాలాను జయప్రదం చేద్దాం


ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేపట్టాలి
21న భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర ప్రచార జాతాలు 
యువతను చైతన్యవంతం చేసేవిధంగా జనసేవాదళ్ క్యాంపులు నిర్వహించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

నమస్తే భారత్ (ప్రతినిధి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రశాంత్ నవంబర్ 18_) కొత్తగూడెం : ప్రజలభాగస్వామ్యంతో సిపిఐ శాతవాసంతోత్సవాలను, డిసెంబర్ 26న ఖమ్మం నగరంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో మంగళవారం జరిగిన కొత్తగూడెం టౌన్, సుజాతనగర్, జూలూరుపాడు, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల పరిధిలోని జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు, ముఖ్యుల సమావేశానికి అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సిపిఐ వంద సంవత్సారాలు పూర్తి చేసుకుంటున్న సందర్గంగా జాతీయ స్థాయి ముగింపు వేడుకలు, బహిరంగ సభ ఖమ్మం నగరం వేడుకవుతోందని, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు జిల్లా నుంచి లక్ష మందిని తరలించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వందేళ్లుగా పేద, బడుగు, బహీన వర్గాలకు, రైతులకు, కార్మికవర్గానికి సిపిఐ అందిస్తున్న సేవలు, ప్రజా పోరాటాలను ప్రజలకు వివరించేవిధంగా ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఖమ్మం నగరంలో ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు, 40దేశాలకు చెందిన కమ్యూనిస్టు ప్రతినిధులు పాల్గొంటున్నారని సాబీర్ పాషా తెలిపారు.  ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్లో ప్రారంభమైన రెండు రాష్ట్ర ప్రచార జాతాలు ఈ నెల 21న జిల్లాలో ప్రవేశిస్తాయని, జిల్లాలోని పలు మండలాల్లో ఈ ప్రచారజాతాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  బహిరంగ సభ సందర్బంగా జిల్లా వ్యాపితంగా పది కేంద్రాల్లో జనసేవాదళ్ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని, మూడు వేల మంది యువకులను జనసేవాదళంగా సిద్ధంచేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్రకుమార్, గనిగళ్ల వీరాస్వామి, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, భూక్యా దస్రు, ఎస్ కె ఫహీమ్, మండల కార్యదర్శులు గుండెపిన్ని వెంకటేశ్వర్ రావు, దీటి లక్ష్మీపతి, కొమారి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Latest News

మణికొండలో 121.50 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 19న శ్రీకారం: పాల్గొననున్న మంత్రులు, స్పీకర్  మణికొండలో 121.50 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 19న శ్రీకారం: పాల్గొననున్న మంత్రులు, స్పీకర్ 
      నమస్తే భారత్, ​మణికొండ, బి ప్రభాకర్ ప్రతినిధి నవంబర్ 18):​మణికొండ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం అందించే దిశగా ఈ నెల 19వ తేదీన
మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ
యడ్లపాడులో పోలీసుల దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి 
ప్రజలభాగస్వామ్యంతో శతవసంతోత్సవాలాను జయప్రదం చేద్దాం
ఇది ముమ్మాటికీ బూటకువు ఎన్ కౌంటరే
రుద్రంపూర్ జయశంకర్ గ్రౌండ్ మరియు రామవరం కమ్యూనిటీ హాల్ నందు మెరుగైన వసతులు కల్పించాలని కొత్తగూడెం ఏరియా జి.ఎం ను కలిసిన !.. కొత్తగూడెం ఏరియా ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్. 
పత్రికా శీర్షిక: స్మశాన వాటికలో నీటి సమస్యపై ఎమ్మెల్యే జోక్యం!*త్వరలోనే సమస్యకు పరిష్కారం 

Advertise