ఎస్ఎఫ్ఐ 50వ స్వర్ణోత్సవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

On
ఎస్ఎఫ్ఐ 50వ స్వర్ణోత్సవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

 

:- ఎస్ఎఫ్ఐ పత్తికొండ మండల కార్యదర్శి విష్ణు


పత్తికొండ(నమస్తే భారత్):-ఆలూరులో ఈనెల 4-5 తారీకుల్లో ఆలూరు పట్టణంలో జూనియర్ కళాశాల ఆడిటరియంలో జరుగు
ఎస్ఎఫ్ఐ 50వ స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని పత్తికొండ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి విష్ణు పిలుపునిచ్చారు. బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ఆలూరు పట్టణంలో 4 5వ తారీఖుల్లో జరిగే ఎస్ఎఫ్ఐ 50వ స్వర్ణోత్సవ మహాసభలకు పత్తికొండ నుండి మండల పరిధిలో ఉన్న అన్ని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెస్సు బిల్లులు నెలకు ₹3,000 ఇవ్వాలని
చదువు పోరాడు నినాదంతో విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్నా ఏకైక విద్యార్ధి సంఘం భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అని కొనియాడారు.  ఎస్ఎఫ్ఐ 50వ స్వర్ణోత్సవ జిల్లా మహాసభలను ఆలూరులోని డిసెంబర్ 4,5 తేదీలలో నిర్వహిస్తున్న సందర్బంగా ఆలూరు జూనియర్ కళాశాల ఆడిటరియంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు కే నరేంద్ర, కోశాధికారి ఎం ధర్మ తేజ, కార్యవర్గ సభ్యులు వి. వినయ్ కుమార్, ఆచారి, తదితరులు పాల్గొన్నారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise