భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
కేశంపేటలో శ్రీ సీత రామాంజనేయ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నమస్తే భారత్ షాద్ నగర్ మార్చ్25:కేశంపేట మండలకేంద్రంలోని శ్రీ సీత రామాంజనేయ దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడింది. ఈ శుభకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సామాజిక ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ పీఎసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, స్థానిక సర్పంచ్ శ్రీశైలం, మాజీ సర్పంచులు వెంకట్ రెడ్డి, యాదగిరి రావు, నవీన్ కుమార్, మాజీ ఎంపీటీసీ మల్లేష్ యాదవ్, నాయకులు జమాల్ ఖాన్, దర్శన్, జగన్ రెడ్డి, రామకృష్ణ, ప్రవీణ్ రెడ్డి, బైకని శేఖర్, నరేష్ యాదవ్, శ్రీను, వెంకటేష్, రాము, జగన్ తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
