విరశైవ జంగమ స్మశాన వాటిక స్థలం అన్యాక్రాంతం

న్యాయం చేయాలంటున్నా విరశైవ జంగమ సంఘమ్ - జిల్లేడు చౌదర్ గూడ లో వెలుగు చూసిన వైనం

విరశైవ జంగమ స్మశాన వాటిక స్థలం అన్యాక్రాంతం

నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్ 20:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదర్ గూడ మండలం తుంపల్లి గ్రామపంచాయతీ శివారులో గల సర్వే నెంబర్ 161 లో 35 గుంటలు సుమారు 200 ఏండ్ల క్రితం నుండి విరశైవ జంగమ సమాధుల కొరకు కేటాయించారు. అట్టి భూమిని జంగమ సంఘమ్ వారు సమాధుల కొరకు వినయోగించుకుంటున్నారు. ఈ సందర్బంగా కొన్ని రోజుల క్రితం విరశైవ జంగమ సంఘమ్ కు చెందిన శివపూజ శాంత లింగం, శివాపూజ ప్రభాకర్, మఠం రాజశేఖర్ సదరు భూమిని సర్వే చేయిస్తే అక్కడ 20 గుంటలు భూమి మాత్రమే మిగిలి ఉంది. మిగతా భూమి ఎక్కడ పోయింది అని వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం కు వెళ్లి ఇట్టి భూమి సర్వే నెంబర్ 161 లో ఉండాల్సిన 35 గుంటలు బదులు 20 గుంటలే మిగిలి ఉందని దానిని మళ్ళీ సర్వే చేయించి మా పూర్వికుల నుండి ఉన్న 35 గుంటలు మాకు ఇప్పించి న్యాయం చేయాలనీ దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తు పెట్టి 2 నెలలు కావస్తున్న ఇప్పటివరకు స్థానిక అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి ఇట్టి భూమిని టీ పాన్ ప్రకారం సర్వే చేయించి మాకు సత్వరమే న్యాయం చేయాలంటు వారు కోరుతున్నారు.

Views: 0

About The Author

Namasthe Bharat Desk Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Error on ReusableComponentWidget

Latest News

ఐ మాక్స్ లైట్ల ప్రారంభం ఐ మాక్స్ లైట్ల ప్రారంభం
నమస్తే భారత్ /  మద్దూరు, (మే 5) : కొత్తపల్లి మండల పరిధిలోని వాల్య నాయక్ తండా, భోజ్యనాయక్  తండాల్లో సోమవారం రాత్రి ఐ మ్యాక్స్ లైట్లను...
పదిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు సత్కారం
వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
రాజేంద్రనగర్ లో ఘనంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
మాజీ మంత్రి  పట్టొళ్ల సబితా ఇంద్రారెడ్డి  జన్మదిన వేడుకలు
మహిళా చట్టాలపై మహిళలు ఉండే ప్రదేశానికి వెళ్లి  అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న సిద్దిపేట షీటీమ్ బృందం  
కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కారీ గారికి శాలువ కప్పి స్వాగతం పలికిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్.