గ్రామ సేవలో నిలిచిన మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ లకి ఘన సన్మానం…

On
గ్రామ సేవలో నిలిచిన మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ లకి ఘన సన్మానం…

 

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్28:లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో విశిష్టమైన సేవలందించిన మాజీ సర్పంచ్ నర్సింలు గారిని, ఉప సర్పంచ్ రాజేష్ గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయని నాయకులుగా వారు గుర్తింపు పొందారు.సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామానికి నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ సహాయం ఆలస్యమవుతుందని గ్రహించి తన సొంత బోర్‌ నుండి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి గ్రామస్తులకు తాగునీరు అందించటం నర్సింలు గారి అత్యంత గొప్ప సేవగా నిలిచింది.ఎవరైనా విమర్శించినా, తిట్టినా పట్టించుకోకుండా “గ్రామానికి సేవే ముఖ్యం” అనే ధ్యేయంతో ముందుకు సాగారు.గ్రామంలో రహదారులు, శానిటేషన్, వీధి లైట్లు తదితరాల అభివృద్ధికి కూడా వారు వ్యక్తిగతంగా శ్రమించడంతో పాటు, ప్రభుత్వ పథకాలను సమర్థంగా తీసుకొచ్చి ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు.ఈ సేవల గుర్తింపుగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువత, పాల్గొన్నారు. గ్రామస్థులు ఆయన నాయకత్వం, నిజాయితీ, సేవాభావాన్ని ప్రశంసించారు.

Tags

Share On Social Media

Related Posts

Latest News

RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన RGIAలో పోయిన బంగారు గొలుసు లభ్యం: ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య బృందం సత్వర స్పందన
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో పోగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు అతి తక్కువ సమయంలోనే గుర్తించి బాధితురాలికి అందజేశారు. ఎస్‌హెచ్‌ఓ ఎస్. కనకయ్య నేతృత్వంలోని...
పైప్‌ గ్యాస్‌కు మారండి.. లేకపోతే...
త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్..?
సింగరేణి కార్మికుడు రాము ఔదార్యం..
భక్తి మనసుకు బలం, సమాజానికి ఐక్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యరంగానికి 30% నిధులు కేటాయించాలి 
న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా

Advertise