నందిగామలో గ్రంథాలయం మంజూరు చేయండి
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డికి ఎమ్మెల్యేతో కలిసి వినతి పత్రం అందజేసిన నందిగామ మండల నాయకులు
On
నమస్తే భారత్,షాద్ నగర్ ఏప్రిల్21:మండల కేంద్రమైన నందిగామలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కి సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి స్థానిక మండల నాయకులు వినతి పత్రం అందజేశారు. కొత్తగా మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా నందిగామలో గ్రంధాలయ ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, దేపల్లె కుమార్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహులు, చించేటి కృష్ణ గౌడ్, తడకల జంగయ్య స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
Views: 0
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Error on ReusableComponentWidget
Latest News
06 May 2025 17:16:18
నమస్తే భారత్: పినపాక : పినపాక మండల నూతన హౌసింగ్ ఏఈ గా గుమ్మడి వినీత బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఏఈ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు...