శంషాబాద్ లో 21st సెంచరీ కళాశాల విద్యార్థుల కృతజ్ఞత సమావేశం
విద్యార్థులే భవిష్యత్తు నిర్దేశకులు గా మారాలి - కళాశాల డైరక్టర్ భవాని శంకర్,
నమస్తే భరత్, రాజేంద్రనగర్, మే 06. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్ నిర్దేశకులని కళాశాల డైరక్టర్ భవాని శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం శంషాబాద్ లోని సోమవారం 21 st సెంచరీ కళాశాల డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన విద్యార్థుల కృతఙ్ఞత సమావేశానికి కళాశాల చీఫ్ కృష్ణ ప్రదీప్, వరుణ్, వేణు, బోధన సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ భవాని శంకర్ మాట్లాడుతూ కేపీ కళాశాల నుంచి యుపిఎస్సి ర్యాంకుల ప్రభంజనం మోగాలని, ఇకనుంచి యుపిఎస్సి ర్యాంకుల ప్రభంజనంతో విద్యార్థులు జేయకే తనం ఎగురవేయాలి అన్నారు. కళాశాల ఫైనలియర్ విద్యార్థులు వారి అనుభవాలను ఫ్యాకల్టీ బోధన విషయాలను తెలిపారు. కళాశాలలో కాంపిటీటివ్ ప్రిపరేషన్ కోసం ఒక మంచి వేదికగా ఈ కళాశాల ఉందన్నారు. ఫ్యాకల్టీ బోధన నైపుణ్యంతో మాకు విజ్ఞానానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలియపరిచారని వారి యొక్క బోధన ఎన్నటికీ మర్చిపోమని విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత ఆశయం వైపు మా ఆలోచన విధానాన్ని కొనసాగిస్తామని మంచి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

