10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని సన్మానించిన రాజ్ కుమార్ రెడ్డ
నమస్తే భారత్ / నారాయణపేట్ జిల్లా : పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భీష్మరాజ్ ఫౌండేషన్, పదవ తరగతిలో 566/600 మార్కులను సాధించిన విద్యార్థిని హరిషను మంగళవారం నారాయణపేటలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి శాలువతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థినీ విద్యార్థులను ఉన్నత విద్య వైపు మళ్లించాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కోరారు. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులను తమ ఫౌండేషన్ ప్రోత్సహిస్తుందని తెలిపారు. విద్యార్థిని హరిష తండ్రి బాలునాయక్ తో పాటు ఫౌండేషన్ సభ్యులు పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, నర్సింహనాయుడు, రుద్రారెడ్డి, అశోక్, ఎం.సంతోష్, గోపాల్ రెడ్డి, నందుకుమార్ తదితరులు ఉన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

