మహిళా సాధికారతకై కృషి చేద్దాం. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మరియు అడిషనల్ కలెక్టర్

నమస్తే భారత్ /నారాయణపేట్ జిల్లా : నారాయణపేట జిల్లా మహిళా సాధికారత కేంద్రం సింగారం తగ్గారా ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన న్యాయమూర్తి మరియు లీగల్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ శ్రీ బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు గౌరవ లీగల్ సర్వీసెస్ సంస్థ శ్రీమతి వింధ్య నాయక్ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.జిల్లా లీగల్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారతకై కృషి చేద్దాం అన్నారు, భారతీయ న్యాయ సంహిత, మహిళా చట్టాలను పూర్తి స్థాయిలో అమలు పరుచుటకు అన్నిమహిళా సంస్థలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి మరియు లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీ వింధ్య నాయక్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతీయ మహిళా కేంద్రీకృత చట్టాలు, మహిళా కేంద్రీకృత నిబంధనలపై నేరాలుగా పరిగణించబడే చర్యలు, చట్టవిరుద్ధమైన లోపాలు, ప్రాథమిక హక్కులు , శిక్షలు, సాధారణ మినహాయింపులు , ప్రేరేపణ, నేరపూరిత కుట్ర మరియు ప్రయత్నం, స్త్రీ మరియు పిల్లలపై నేరాలు. కిడ్నాప్, దోపిడీ, వాహన దొంగతనం, దోపిడీ, సైబర్ నేరాలు, కాంట్రాక్ట్ హత్యలు, వంటి ఏదైనా కొనసాగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలు , అత్యాచారం, లైంగిక వేధింపులు, వేధించడం మరియు స్త్రీ నమ్రతను అవమానించడం వంటి ఐపిసి సెక్షన్స్ మరియు బిఎన్ఎస్ కొత్త నిబంధనలను వివరించడం జరిగింది. బి ఎన్ యస్ లో, 20 కొత్త నేరాలను చేర్చారు మరియు రద్దు చేయబడిన ఐ పీసీ లోని 19 నిబంధనలను తొలగించారు. 33 నేరాలకు జైలు శిక్షను పెంచారు మరియు 83 నేరాలకు జరిమానాలను పెంచారు. 23 నేరాలకు తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. ఆరు నేరాలకు సమాజ సేవ శిక్షను ప్రవేశపెట్టారు న్యాయమూర్తి శ్రీ వింధ్య నాయక్ అన్నారు.దానిలో భాగంగా ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ మండలి చైర్మన్ అశోక్ శ్యామల చిల్డ్రన్స్ చట్టాలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ బి ఎన్ యస్ ఆక్ట్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మిపతి గౌడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్ మరియు టోల్ ఫ్రీ 15100 గురించి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వరి ఉమెన్స్ చట్టాలు , సీనియర్ న్యాయవాది నందు నామాజీ, బాల్య వివాహాలు తగిన చట్టలలు, బాలల సంక్షేమ మండలి మెంబర్ యాదయ్య, సీడీపీవో సరోజినీ, వెంకటేశ్వరమ్మ, సూపర్వైజర్స్, చిల్డ్రన్ హోమ్ సూపరిండెంట్ శ్వేత, డీసీపీవో తిరుపతయ్య, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్టులు అనిత, నరసింహ, చెన్నప్ప షీ-టీమ్, సఖి సెంటర్ అడ్మిన్ క్రాంతిరేఖ, భరోసా కోఆర్డినేటర్ ప్రమీల, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ నర్సిములు, సాయి, సంధ్య మరియు ఆయా విభాగాల టీమ్ సభ్యులు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts

Latest News
